Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన మైత్రీ మేకర్స్ సినిమాలు.. ఏకంగా అన్ని సినిమాలకు అవార్డు !

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు అవార్డుల పంట పండింది. ఈ సంస్థ నిర్మించిన నాలుగు సినిమాలకు గద్దర్ అవార్డు వరించింది. 2015 ఉత్తమ చిత్రం విభాగంలో శ్రీమంతుడు, 2016లో జనతా గ్యారేజ్, 2018లో రంగస్థలం, 2021లో ఉప్పెన చిత్రాలు అవార్డు గెలుచుకున్నాయి.

New Update

Gaddar Awards:  తెలంగాణలో సినీ అవార్డుల సంబరం నెలకొంది.  కొత్త రాష్ట్రం ఏర్పడిన 12ఏళ్ళ తర్వాత ప్రభుత్వం దివంగత తెలంగాణ నాయకుడు గద్దర్ పేరిట అవార్డు లను ప్రకటించింది.  2014 నుంచి 2024 వరకు విడుదలైన చిత్రాలకు అవార్డులు  ఇచ్చారు.  మొత్తం 1248 నామినేషన్లు రాగా.. వాటిలో ఉత్తమ చిత్రాలను పరిశీలించి వాటికి అవార్డులు ప్రకటించారు. ఈరోజు 2014- 2023 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించిన విజేతలను ప్రకటించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ  మేకర్స్  కి అవార్డుల పంట పండింది. ఈ బ్యానర్ లో తెరకెక్కిన నాలుగు సినిమాలకు  'ఉత్తమ చిత్రం' విభాగంలో గద్దర్ అవార్డు వరించింది. 

Also Read :  కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

మైత్రి మేకర్స్ పోస్ట్

నాలుగు సినిమాలకు 

2015 నుంచి మహేష్ బాబు నటించిన  'శ్రీమంతుడు'  2016 విభాగం నుంచి ఎన్టీఆర్ జనతా గ్యారేజ్,  2018 నుంచి  రామ్ చరణ్ రంగస్థలం, 2021 నుంచి  ఉప్పెన ఉత్తమ చిత్రాలుగా అవార్డు గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా మైత్రి మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మా సినిమాలను గుర్తించి వారికి ఈ గౌరవాన్ని అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి , గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జ్యురీ సభ్యులకు ధన్యవాదాలు.  మా మొదటి మూడు చిత్రాలు శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం..  అలాగే మా  బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటైన ఉప్పెన గద్దర్ అవార్డు జాబితాలో  ఉండడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేశారు.

Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు