విష్ణు తప్పేం లేదు, చేసిందంతా మనోజే .. మోహన్ బాబు భార్య సంచలన లేఖ

తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఆదివారం నాడు మంచు మనోజ్‌ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇస్తూ పహాడీ షరీఫ్‌ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు.

New Update
manchu22

తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఆదివారం నాడు మంచు మనోజ్‌ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇస్తూ  పహాడీ షరీఫ్‌ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. అందులో ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని పేర్కొన్నారు.

Also Read : అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..!

డిసెంబర్‌ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు  జల్‌పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేశాడు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్‌.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. 

ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో.. పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా ‘మేమిక్కడ పనిచేయలేమని’.. వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదు..' అని నిర్మల లేఖలో పేర్కొన్నారు.

Also Read : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..!

publive-image

Also Read: బాబూ పక్కకెళ్లి ఆడుకోమ్మా.. గజరాజు మర్యాద చూడండి

Also Read: శీతాకాలంలో ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు