/rtv/media/media_files/2025/06/15/wCebDGynt4gdw1LYbs0H.jpg)
Kantara Chapter 1 Boat Capsizes During Shoot
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాంతార చాప్టర్ 1’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీంకు బిగ్ షాక్ తగిలింది.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
ఈ మూవీ టీం ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుస ప్రమాదాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలోని మాణి జలాశయం దగ్గర జరుగుతుండగా.. శనివారం సాయంత్రం 30 మంది ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న పడవ జలాశయంలో మునిగిపోయింది.
Also read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం
దీంతో ఆ పడవలో ఉన్న 30 మంది నీటిలో మునిగిపోయారు. అందులో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. అనంతరం వీరంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ నీటిలో షూటింగ్కు సంబంధించిన టెక్నికల్ పరికరాలు కొట్టుకుపోయాయి.
Also read: ప్రతిరోజూ ఒక గ్లాసు బెల్లం పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?
ఇప్పటికే ముగ్గురు మృతి
ఇప్పటికే 'కాంతారా ' చిత్ర బృందానికి సంబంధించి ఇద్దరు నటులు మృతిచెందగా.. కళాభవన్ మూడో వ్యక్తి. ఇటీవలే కాంతారా 1 లో నటించిన ప్రముఖ కన్నడ నటుడు రాకేష్ పూజారి 33 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ ఎం.ఎఫ్. కపిల్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ సంఘటన 'కాంతారా ' షూటింగ్ లో జరగలేదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఆ రోజు అతడికి షూటింగ్ షెడ్యూల్ లేదని.. వ్యక్తిగత కార్యకలాపాల్లో ఆ ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు.