Rishab Shetty: భారీ ప్రమాదం.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన రిషబ్ శెట్టి!

‘కాంతార చాప్టర్ 1’ టీమ్‌ త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. శనివారం సాయంత్రం 30 మంది ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు రిషభ్ కూడా అందులోనే ఉన్నారు. వెంటనే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఎవరికీ ఏం కాలేదు.

New Update
Kantara Chapter 1 Boat Capsizes During Shoot

Kantara Chapter 1 Boat Capsizes During Shoot

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాంతార చాప్టర్ 1’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీంకు బిగ్ షాక్ తగిలింది. 

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

ఈ మూవీ టీం ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుస ప్రమాదాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలోని మాణి జలాశయం దగ్గర జరుగుతుండగా.. శనివారం సాయంత్రం 30 మంది ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న పడవ జలాశయంలో మునిగిపోయింది.  

Also read: మణిపూర్‌ వెపన్స్‌ ఆఫరేషన్‌..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం

దీంతో ఆ పడవలో ఉన్న 30 మంది నీటిలో మునిగిపోయారు. అందులో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. అనంతరం వీరంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ నీటిలో షూటింగ్‌కు సంబంధించిన టెక్నికల్ పరికరాలు కొట్టుకుపోయాయి. 

Also read: ప్రతిరోజూ ఒక గ్లాసు బెల్లం పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?

ఇప్పటికే ముగ్గురు మృతి

ఇప్పటికే  'కాంతారా ' చిత్ర బృందానికి సంబంధించి  ఇద్దరు నటులు మృతిచెందగా.. కళాభవన్ మూడో వ్యక్తి.  ఇటీవలే  కాంతారా 1 లో నటించిన ప్రముఖ కన్నడ నటుడు రాకేష్ పూజారి 33 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత  జూనియర్ ఆర్టిస్ట్ ఎం.ఎఫ్. కపిల్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.  అయితే ఆ సంఘటన  'కాంతారా ' షూటింగ్ లో జరగలేదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఆ రోజు అతడికి షూటింగ్ షెడ్యూల్ లేదని..  వ్యక్తిగత కార్యకలాపాల్లో ఆ ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు