/rtv/media/media_files/2025/06/27/kamal-haasan-invited-to-oscars-2025-06-27-18-03-18.jpg)
Kamal Haasan invited to Oscars
Kamal Haasan: కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కి అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అవార్డుల సంస్థ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కమిటీలో ఓటింగ్ సభ్యుడిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఇది భారతీయ సినిమా, కమల్ హాసన్ కెరీర్ లో ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది.
Also Read : జూలైలో స్మార్ట్ఫోన్ల జాతరే జాతర.. నథింగ్, శాంసంగ్, వన్ప్లస్ నుంచి కిర్రాక్ మొబైల్స్!
అరుదైన గౌరవం
మొత్తం ప్రపంచవ్యాప్తంగా 683 మంది కొత్త సభ్యులను తమ ఓటింగ్ కమిటీలోకి చేరమని అకాడమీ ఆహ్వానించింది. ఇందులో చాలా మంది ప్రముఖ అంతర్జాతీయ కళాకారులు ఉన్నారు. భారతదేశం నుంచి కమల్ హాసన్తో పాటు మరికొందరికి కూడా ఈ ఆహ్వానం అందింది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, పాయల్ కపాడియాకు కూడా ఈ గౌరవం దక్కింది. పాయల్ కపాడియా ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ' గ్రాండ్ ప్రిక్స్ అవార్డు' గెలుచుకున్నారు. అంతేకాదు ఆమె 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' సినిమా 2024 లో ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కించుకుంది.
ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా
ఈ ఆహ్వానం ఎందుకు ముఖ్యం?
అకాడమీలో ఓటింగ్ సభ్యుడిగా మారడం అంటే, ఆస్కార్ అవార్డులకు ఏ సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణులు నామినేట్ అవ్వాలి.. చివరికి ఎవరు అవార్డు గెలుచుకోవాలిని నిర్ణయించే హక్కు వీరికి లభిస్తుంది. కమల్ హాసన్, పాయల్ కపాడియా, ఆయుష్మాన్ ఖురానా వంటి ఇండియన్ సినిమా ప్రముఖులు ఆస్కార్ కమిటీలో ఉండటంతో భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్ ఇండియన్ 3, కల్కి పార్ట్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు.