/rtv/media/media_files/2024/12/21/8P6EmM7UsgIiVd2Y6aOP.jpg)
allu aravind
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు షాక్ ఇచ్చారు. రామకృష్ణ బ్యాంకు స్కాం కేసు కు సంబంధించి అరవింద్ను ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు.ఈ కేసులో భాగంగా 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు అల్లు అరవింద్ను వివరాలు అడిగారు. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి అల్లు అరవింద్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఈ విచారణ చేశారు.
ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు
ED questioned top producer Allu Aravind for 3 hrs as part of the investigation into the Rs 101 crore Ramakrishna Electronics-Union Bank fraud case. The CBI initially filled FIR alleging significant loan fraud, offshore payments, and suspicious property deals. ED which taken up… pic.twitter.com/etIah43oNo
— Ashish (@KP_Aashish) July 4, 2025
ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు
మరోసారి విచారణకు..
విచారణ అనంతరం అధికారులు అల్లు అరవింద్కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించడానికి ఈడీ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.
ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?
ఇది కూడా చూడండి:Nayanthara-Vignesh: జానీ మాస్టర్ ఎఫెక్ట్.. నయనతార, విఘ్నేష్పై దుమ్మెత్తి పోస్తోన్న నెటిజన్లు!