మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో ‘SSMB29’ చిత్రం తెరకెక్కబోతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీని కోసం ఒకవైపు మహేశ్ ఫ్యాన్స్, మరోవైపు రాజమౌళి ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి ఆసక్తికర పోస్ట్
ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా చిత్రబృందం అందించడం లేదు. కనీసం మొదలు పెట్టినట్లు కూడా ఎవరూ చెప్పకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పోస్ట్ ప్రకారం.. రాజమౌళి, ఆయన వెనుక ఒక సింహం కనిపిస్తుంది. ఆ వీడియోలో సింహాన్ని బోనులో బంధించినట్లు చూపించారు. అనంతరం రాజమౌళి తన పాస్ పోర్ట్ను చూపిస్తూ నవ్వుతున్నట్లు కనిపించాడు.
Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
మహేశ్ డైలాగ్ అదుర్స్
దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో SSMB29 చిత్రానికి సంబంధించినదే అని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. రాజమౌళి పోస్ట్ చేసిన ఆ వీడియోకు మహేష్ బాబు కామెంట్ పెట్టడం మరో ఎత్తనే చెప్పాలి. ‘‘ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’’ అంటూ మహేశ్ చేసిన కామెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పోకిరి మూవీ డైలాగ్ మళ్లీ మహేశ్ నోటంట రావడంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
Also Read: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్
SSMB 29: ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను: మహేశ్ బాబు డైలాగ్ అదుర్స్
మహేశ్ బాబు ‘ssmb29’కి సంబంధించి రాజమౌళి ఓ అప్డేట్ ఇచ్చారు. సింహాన్ని లాక్ చేస్తూ.. తన పాస్ పోర్ట్ను చూపిస్తూ అతడు తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. దానిపై ‘‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’’ అంటూ మహేశ్ బాబు పెట్టిన కామెంట్ వైరల్ అవుతుంది.
director rajamouli mahesh babu ssmb 29 movie update
మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో ‘SSMB29’ చిత్రం తెరకెక్కబోతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీని కోసం ఒకవైపు మహేశ్ ఫ్యాన్స్, మరోవైపు రాజమౌళి ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Cricket: నేడే భారత్-ఇంగ్లాండ్ రెండో టీ 20
రాజమౌళి ఆసక్తికర పోస్ట్
ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా చిత్రబృందం అందించడం లేదు. కనీసం మొదలు పెట్టినట్లు కూడా ఎవరూ చెప్పకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పోస్ట్ ప్రకారం.. రాజమౌళి, ఆయన వెనుక ఒక సింహం కనిపిస్తుంది. ఆ వీడియోలో సింహాన్ని బోనులో బంధించినట్లు చూపించారు. అనంతరం రాజమౌళి తన పాస్ పోర్ట్ను చూపిస్తూ నవ్వుతున్నట్లు కనిపించాడు.
Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
మహేశ్ డైలాగ్ అదుర్స్
దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో SSMB29 చిత్రానికి సంబంధించినదే అని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. రాజమౌళి పోస్ట్ చేసిన ఆ వీడియోకు మహేష్ బాబు కామెంట్ పెట్టడం మరో ఎత్తనే చెప్పాలి. ‘‘ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’’ అంటూ మహేశ్ చేసిన కామెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పోకిరి మూవీ డైలాగ్ మళ్లీ మహేశ్ నోటంట రావడంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
Also Read: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్