/rtv/media/media_files/2025/09/16/kishkindhapuri-ott-2025-09-16-09-57-04.jpg)
Kishkindhapuri OTT
Kishkindhapuri OTT: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) నటించిన తాజా సినిమా ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12, 2025న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్గా నటించింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే ఎమోషనల్ కథతో రూపొందిన సినిమా.
#Kishkindhapuri - OTT & satellite partners
— Cinema Mania (@ursniresh) September 11, 2025
- The latest update reveals that ZEE5 bagged the post-theatrical streaming rights of Kishkindhapuri.
- The satellite rights were acquired by Zee Telugu. pic.twitter.com/I5h5HIQOIT
ఓటీటీకి రెడీ
ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ‘కిష్కింధపురి’ డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ Zee5 సొంతం చేసుకుంది. అక్టోబర్ రెండో వారం లోపు ఈ సినిమా Zee5 లో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది.
ప్రేక్షకులు థియేటర్లలో మిస్ అయినా, ఇంట్లోనే కాంఫర్ట్గా ఈ సినిమా చూడవచ్చు. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఆనందించేందుకు రెడీ అవ్వొచ్చు.
హారర్ థ్రిల్లర్ కాంబో..
‘కిష్కింధపురి’ సినిమా చిన్న బడ్జెట్తో తెరకెక్కినా, ఎమోషన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు, భయపెట్టే హారర్ మూమెంట్స్ అన్నీ మిక్స్ చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరో పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్కి ఇది ఒక డిఫరెంట్ ప్రయత్నంగా నిలిచింది.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రతో మంచి మార్కులు కొట్టేసింది. కథలోని భావోద్వేగాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. దీంతో చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
కిష్కింధపురి vs మిరాయ్..
ఈ సినిమా విడుదలైన వారమే తేజ సజ్జా నటించిన భారీ విజువల్ వండర్ ‘మిరాయ్’ కూడా విడుదలైంది. దీంతో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడే పరిస్థితి ఏర్పడింది. అయితే, మిరాయ్ భారీ బడ్జెట్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా కాబట్టి దానిపై అంచనాలు భారీగా ఉన్నాయి, ‘కిష్కింధపురి’ మాత్రం తన స్థాయిలో ఓ మంచి సినిమా అనిపించుకుంది. మొత్తానికి వీకెండ్ కలెక్షన్స్ పరంగా చూస్తే ‘మిరాయ్’ కొంత లీడ్లో ఉన్నా, ‘కిష్కింధపురి’ మాత్రం మౌత్ టాక్ ద్వారా మెల్లిగా కలెక్షన్స్ ఊపందుకుంటుంది.
టెక్నికల్ టీం..
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. సినిమాలో తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగర్, హైపర్ ఆది, సుధర్శన్, మకరంద్ దేశ్పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. టెక్నికల్గా సినిమా మంచి స్థాయిలో ఉండగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా బలం చేకూర్చింది.
మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు మరో ప్రత్యేకమైన సినిమా అనిపించుకున్న ‘కిష్కింధపురి’, ఇప్పుడు Zee5 ద్వారా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అక్టోబర్ రెండో వారం ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండగా, హారర్, ఎమోషన్ ని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి ఎంటర్టైన్మెంట్గా నిలవనుంది.