Ananya Panday: ఆపరేషన్ సిందూర్ పై అనన్య పాండే వైరల్ కామెంట్స్..
ఆపరేషన్ సిందూర్పై స్పందించిన అనన్య పాండే, భారత సైన్యం ధైర్యాన్ని, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. పహల్గామ్ ఘటనను బాధాకరంగా పేర్కొంటూ, భారత్ ప్రతీకారం కాదు, బాధ్యతతో స్పందించే దేశమని తెలిపింది.
Ananya Panday: భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై స్పందిస్తూ బాలీవుడ్ నటి అనన్య పాండే భారత సైనిక దళాల ధైర్యసాహసాలను ప్రశంసించారు. ఇటీవల అనుష్క శర్మ, జాన్వీ కపూర్ లాంటి ప్రముఖులు ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనన్య కూడా సోషల్ మీడియా ద్వారా భారత రక్షణ దళాలకు తన కృతజ్ఞతను తెలియజేశారు.
పహల్గామ్ ఒక మరచిపోలేని బాధాకర ఘటనగా అభివర్ణించారు. భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాలపై ఆమె గర్వం వ్యక్తం చేశారు. భారత సైన్యం చూపిన ధైర్యం, క్రమశిక్షణ దేశ గౌరవాన్ని సమర్థంగా నిలబెట్టిందని తెలిపారు.
“చరిత్రలో కొన్ని సార్లు మౌనం వీడి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి, పహల్గామ్లో జరిగిన ఘటన అలాంటిదే. చాలా బాధాకరమైనది, భయానకమైనది, మర్చిపోలేని సంఘటన. ఆ దుర్ఘటనను చూస్తూ మన గుండె రగిలిపోయింది. కానీ ఆపరేషన్ సిందూర్ లాంటి గొప్ప నిర్ణయాలతో భారత్ తన ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ నిలబడుతుంది.”
“ప్రధాని మోదీ గారి నాయకత్వంలో, భారత సైనికుల ధైర్య సాహసాలతో, మన దేశం సత్తా ఏంటో చూపించింది. ప్రతి అమాయకుల ప్రాణ నష్టం మనకో తీరని విషాదం. భారత్ ప్రతీకారానికి ప్రతీక కాదు. శాంతి, కరుణ, ఐక్యత అనేవే మన దేశపు విలువలు. మనం ప్రతీకారం తో కాదు బాధ్యతతో పోరాడుతున్నాం ” అని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాలపై అభినందనలు తెలుపుతూ. “మన రక్షక దళాల పట్ల నా హృదయపూర్వక గౌరవం, మన ప్రభుత్వం పట్ల అభినందన తెలుపుకుంటున్నాను.. జై హింద్!” అని ఆమె పేర్కొన్నారు.
Ananya Panday: ఆపరేషన్ సిందూర్ పై అనన్య పాండే వైరల్ కామెంట్స్..
ఆపరేషన్ సిందూర్పై స్పందించిన అనన్య పాండే, భారత సైన్యం ధైర్యాన్ని, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. పహల్గామ్ ఘటనను బాధాకరంగా పేర్కొంటూ, భారత్ ప్రతీకారం కాదు, బాధ్యతతో స్పందించే దేశమని తెలిపింది.
Ananya Panday
Ananya Panday: భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై స్పందిస్తూ బాలీవుడ్ నటి అనన్య పాండే భారత సైనిక దళాల ధైర్యసాహసాలను ప్రశంసించారు. ఇటీవల అనుష్క శర్మ, జాన్వీ కపూర్ లాంటి ప్రముఖులు ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనన్య కూడా సోషల్ మీడియా ద్వారా భారత రక్షణ దళాలకు తన కృతజ్ఞతను తెలియజేశారు.
Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
పహల్గామ్ ఒక మరచిపోలేని బాధాకర ఘటనగా అభివర్ణించారు. భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాలపై ఆమె గర్వం వ్యక్తం చేశారు. భారత సైన్యం చూపిన ధైర్యం, క్రమశిక్షణ దేశ గౌరవాన్ని సమర్థంగా నిలబెట్టిందని తెలిపారు.
Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
మౌనం వీడి యుద్ధం..
“చరిత్రలో కొన్ని సార్లు మౌనం వీడి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి, పహల్గామ్లో జరిగిన ఘటన అలాంటిదే. చాలా బాధాకరమైనది, భయానకమైనది, మర్చిపోలేని సంఘటన. ఆ దుర్ఘటనను చూస్తూ మన గుండె రగిలిపోయింది. కానీ ఆపరేషన్ సిందూర్ లాంటి గొప్ప నిర్ణయాలతో భారత్ తన ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ నిలబడుతుంది.”
Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్లోకి తరలింపు
“ప్రధాని మోదీ గారి నాయకత్వంలో, భారత సైనికుల ధైర్య సాహసాలతో, మన దేశం సత్తా ఏంటో చూపించింది. ప్రతి అమాయకుల ప్రాణ నష్టం మనకో తీరని విషాదం. భారత్ ప్రతీకారానికి ప్రతీక కాదు. శాంతి, కరుణ, ఐక్యత అనేవే మన దేశపు విలువలు. మనం ప్రతీకారం తో కాదు బాధ్యతతో పోరాడుతున్నాం ” అని అభిప్రాయపడ్డారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
ప్రభుత్వం తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాలపై అభినందనలు తెలుపుతూ. “మన రక్షక దళాల పట్ల నా హృదయపూర్వక గౌరవం, మన ప్రభుత్వం పట్ల అభినందన తెలుపుకుంటున్నాను.. జై హింద్!” అని ఆమె పేర్కొన్నారు.