తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ యంగ్ హీరోల్లో ఉన్ని ముకుందన్ కూడా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలో మోహన్ లాల్ కొడుకుగా నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'భాగమతి' చిత్రంలో అనుష్క ప్రేమికుడిగా మెప్పించారు. ఆయన హీరోగా నటించిన తాజా మలయాళ చిత్రం 'మార్కో' డిసెంబర్ 20న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, బాలీవుడ్ భాషల్లో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. సినిమాలో తీవ్రమైన హింస, రక్తపాతం ఉందని కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల నుండి భారీ ఆదరణను అందుకుంది. Also Read : ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి ICONIC APPRECIATION FOR THE #MARCO TEAM FROM OUR PUSHPA RAJ, @alluarjun GARU💥💥💥Don't miss the MOST VIOLENT FILM EVER, #Marco, at your nearest theatres❤🔥Book your tickets now! https://t.co/iTUppJMP6WReleased in Telugu states by @NVRCinema@iamunnimukundan @shareefvr1… pic.twitter.com/wxOcIzZwBq — Ramesh Bala (@rameshlaus) January 9, 2025 ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని భారీ సంఖ్యలో థియేటర్లకు వెళ్లి వీక్షిస్తున్నారు. ఈ సినిమా ఉన్ని ముకుందన్కు పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా టీమ్ను అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ను విడుదల చేసింది. Also Read : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.! నేషనల్ అవార్డు విజేత అల్లు అర్జున్ స్వయంగా దర్శకుడితో పాటు చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్సులు, ప్రొడక్షన్ వాల్యూస్, ఉన్ని ముకుందన్ నటనపై మెచ్చుకున్నారు. ఆయన ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా చూసి, ఇందులో పాల్గొన్న ప్రతీ వ్యక్తిని అభినందించినట్లు మూవీ టీమ్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.