Rakul Preet Singh: అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారు - నటి రకుల్ ప్రీత్ సంచలన కామెంట్స్!

అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినపుడు అబార్షన్ చేయించుకోమని ఈజీగా చెప్పేస్తారని నటి రకుల్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఆ బాధ ఒక్క మహిళకు మాత్రమే తెలుస్తుంది. ఈ నొప్పి గురించి భర్తలు తెలుసుకుని.. తమ భార్యలకు మద్ధతు పలకాలని నటి రకుల్ ప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
actress rakul preet singh sensational comments on abortions

actress rakul preet singh sensational comments on abortions

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్‌గా పేరుపొందారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి యంగ్ అండ్ స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్ అందుకున్నారు. 

ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

అబార్షన్ చేయించుకోమని ఈజీగా చెప్పేస్తారు

అయితే ఇప్పుడు ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఆమె బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ సినిమాలు చేస్తూ బాగా పాపులర్ అయింది. అదే సమయంలో నిర్మాతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నటి రకుల్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇదే తరుణంలో ఆమె తాజాగా అబార్షన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

చాలా మంది చేసే తప్పు అబార్షన్ అని అన్నారు. మహిళల్లో ఇది తీవ్రమైన బాధ అని తెలిపారు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినపుడు చాలా మంది అబార్షన్ చేయించుకోమని ఈజీగా చెప్పేస్తారని.. కానీ ఆ బాధ ఒక్క మహిళకు మాత్రమే తెలుస్తుందని అన్నారు. అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వారికోసం ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. వాటిని వదిలేసి అబార్షన్ బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

కానీ అది మహిళలకు ఎంత కష్టమో ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అన్నారు. సాధారణంగా స్కిన్ లేయర్ పిల్ వేస్తేనే ఎంతో నొప్పి ఉంటుంది.. అలాంటిది ఒక జీవాన్ని బాడీ నుంచి తొలగించాలంటే అది మహిళలకు శారీరకంగానూ, మానసికంగానూ చాలా భయంగా ఉంటుంది. ఇప్పటికీ 5గురిలో ఇద్దరు మహిళలు మూడు నుంచి ఐదు అబార్షనలు చేయించుకుంటున్నారన్నారు. ఈ నొప్పి గురించి భర్తలు తెలుసుకుని.. తమ భార్యలకు మద్ధతు పలకాలని నటి రకుల్ ప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

actress-rakulpreet-singh | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు