Mohan Babu: మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు పహాడీషరీఫ్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి వివరాలు, వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే.. పోలీసులకు మోహన్ బాబు షాక్ ఇచ్చారు. విచారణకు నో చెప్పి.. తమ ఇంటి సమస్య తామే పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే అని అన్నారు. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారని చెప్పారు. 'మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది.. మేమె పరిష్కరించుకుంటాం.. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు పరిష్కరించా, కలిసేలా చేశా.' అని మోహన్ బాబు పోలీసుల విచారణకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి మంచు మనోజ్ పై కేసు..! మంచు ఫ్యామిలీ రోడ్డెక్కింది. హీరో మంచు మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనికపై కేసు నమోదు చేశారు పోలీసులు. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు ముందు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఫిర్యాదుపై ఇప్పటికే 'ఎక్స్' వేదికగా మంచు మనోజ్ స్పందించారు. ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం ప్రశిస్తే కేసులా?.. ఆస్తికోసమే ఇలా చేస్తున్నాడని తనపై మోహన్ బాబు చేస్తున్న ఆరోపణలపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులా లేదని క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్. తాను, తన భార్య సొంత కాళ్ల మీద నిలబడుతున్నాం అని చెప్పారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నా అని అన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా దోపిడీకి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు గురవుతున్నారని అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆరోపణలు చేస్తున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు మనోజ్. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత