చంద్రబాబు కోర్టుకు ఆదేశాలను ఉల్లంఘించారా..ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా కోర్టు కొన్ని షరతులను విధించిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా సీఐడీ కూడా కొన్ని షరతులను పెట్టింది. దానిపైనే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు…ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లే క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించలేదని సీఐడీతోపాటు ప్రభుత్వం కూడా భావిస్తోంది. మధ్యంతర బెయిల్ ఇస్తే ఈ ర్యాలీలు ఏంటని వైపీసీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర బెయిల్ కు అదనపు షరతులు పెట్టాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ తప్పనిసరి అని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్నన్యాయమూర్తి ఎల్లుండికి తీర్పును వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..Chandrababu : చంద్రబాబుపై కోర్టుకు సిఐడి ఫిర్యాదు..!!
చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ కు అదనపు షరతులు పెట్టాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది.
Translate this News: