China Mobiles: మన దేశంలో చైనా మొబైల్స్ హవా.. ఆ బ్రాండ్స్ కే ఎక్కువ డిమాండ్!

మన దేశంలో చైనా కంపెనీల మొబైల్స్ ఆదరణ పెరిగింది. నాలుగు చైనీస్ బ్రాండ్లు Xiaomi, Realme, Vivo, Oppo భారత్ మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టాప్ బ్రాండ్స్ లో మొదటి నాలుగు స్థానాలు వీటివే. ఐదో ప్లేస్ లో దక్షిణ కొరియాకు చెందిన Samsung ఉంది 

New Update
China Mobiles: మన దేశంలో చైనా మొబైల్స్ హవా.. ఆ బ్రాండ్స్ కే ఎక్కువ డిమాండ్!

China Mobiles: లడఖ్‌లోని గాల్వాన్ లోయలో 2020 సంవత్సరం  జరిగిన సైనిక ఘర్షణ తర్వాత భారత్, చైనాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కనిపించింది. దీని ప్రభావంతో భారత్ అనేక చైనా కంపెనీలను బహిష్కరించడం ప్రారంభించింది. చైనీస్ యాప్‌లు నిషేధించబడ్డాయినిషేధించారు. ఇదొక్కటే కాదు చైనా నుంచి వచ్చే పెట్టుబడి నుంచి అధికారులు వీసాల పాస్ వరకు కూడా అన్నింటిపై గట్టి నిఘా పెట్టారు. అయితే ఇంత జరుగుతున్నా 'హిందీ-చినీ భాయ్-భాయ్' అనే పరిస్థితి మాత్రం వ్యాపార రంగంలో ముఖ్యంగా మొబైల్ రంగంలో కొనసాగుతోంది. 

వాస్తవానికి, ఇది భారతీయులు చైనీస్ బ్రాండ్‌లను ఇష్టపడే విధానాన్ని ప్రతిబింబిస్తోంది. అది కూడా ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ సంబంధిత బ్రాండ్‌ల విషయంలో చాలా ఎక్కువగా ఉంది.  అనేక పరిమితులు ఉన్నప్పటికీ, చైనా కంపెనీలు భారతదేశంలో గట్టి వ్యాపారం చేస్తున్నాయి. నిజానికి, వారి అమ్మకాలు ఎంత బలంగా ఉన్నాయి అంటే భారతీయ బ్రాండ్లు వాటి ముందు నిలబడలేకపోతున్నాయి. 

Xiaomi, Vivo, Realme, Oppo బ్రాండ్ల హవా..
China Mobiles: మనం  చైనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ల గురించి మాట్లాడినట్లయితే, నాలుగు చైనీస్ బ్రాండ్లు Xiaomi, Realme, Vivo అలాగే Oppo భారతీయ మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవి దేశంలోని టాప్-5 ఫోన్ బ్రాండ్‌లలో ఉన్నాయి. ఇక  దక్షిణ కొరియాకు చెందిన బ్రాండ్ Samsung ఐదో స్థానంలో ఉంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ - ఐడిసి రిపోర్ట్ ప్రకారం, ఈ 4 చైనీస్ బ్రాండ్‌ల విక్రయాలు రూ. 90,000 నుండి 95,000 కోట్ల వరకు ఉన్నాయి.

చైనా సరుకు నాణ్యతపై బెంగలేదు..
China Mobiles: చైనీస్ బ్రాండ్‌లకు డిమాండ్ పెరగడానికి కారణం చైనీస్ వస్తువులలో నాణ్యత ఉండదు అని పడిన ముద్రను చెరిపేసుకోవడమే అని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. భారతీయులను తక్కువ ధరలలో మంచి నాణ్యత - ఫీచర్లను ఇష్టపడే కస్టమర్‌లుగా పరిగణిస్తారు. ఈ నాలుగు చైనీస్ బ్రాండ్‌లు భారతీయ కస్టమర్ల ఈ డిమాండ్‌ను నెరవేర్చడానికి పనిచేశాయి. అందుకే భారతీయ కస్టమర్లు ఈ బ్రాండ్స్ ప్రోడక్ట్స్ ను ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు.

ET రిపోర్ట్ ప్రకారం కేవలం చైనీస్ ఫోన్‌లు మాత్రమే భారతీయుల జీవితంలో భాగం కాదు. నాసిరకం నాణ్యత, తక్కువ ధరలకు మరిన్ని ఫీచర్లు లభిస్తాయనే భయం తొలగిపోవడంతో ఇప్పుడు టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్ మార్కెట్‌లలో కూడా వీరి ఆధిపత్యం కనిపిస్తోంది. Haier నేడు రిఫ్రిజిరేటర్ల పరంగా భారతదేశంలో నాల్గవ అతిపెద్ద బ్రాండ్. టీవీ విక్రయాల పరంగా కూడా హైయర్ నాల్గవ అతిపెద్ద ప్లేయర్ గా ఉంది. చౌక టీవీల శ్రేణిలో టాప్ బ్రాండ్‌లలో Xiaomi కూడా ఉంది.

Also Read: చైనాకు ముసుగు దెబ్బ.. మాల్దీవ్స్ తో భారత్ ఒప్పందం..

Advertisment
తాజా కథనాలు