Andhra Pradesh: తెలంగాణ సీఎంకు ఏపీ ముఖ్యమంత్రి లేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని ఆహ్వానించారు. జులై 6 సాయంత్రం వీటిని చర్చించడానికి కలుద్దామని చెప్పారు.

AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!
New Update

ముఖాముఖి కలిసి మాట్లాడుకుంటే జటిలమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని, తద్వారా తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు అంటున్నారు. అందుకే తాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశానని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కొన్ని సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని...వాటిని చర్చించడానికి కలుద్దామన్నానని చెప్పారు. ఈ నెల 6వ తారీఖున రేవంత్‌ రెడ్డిని కలుస్తానని చంద్రబాబు చెప్పారు.

Also Read:Israel: ఒకేరోజు 50 మంది ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్

#chandra-babu #telangana #letter #andhra-pradesh #revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe