కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేదలకు 5 కోట్ల ఇళ్లను నిర్మిస్తున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఇప్పటికే మూడున్నర కోట్ల ఇండ్లను నిర్మించామన్న ఆయన.. మరో 50 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది చివరకు అవి కూడా పూర్తవుతాయని అర్వింద్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కోట్ల మంది లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు అందుతున్నాయని ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..MP Arvind: కేంద్రం 5 కోట్ల ఇళ్లను నిర్మిస్తోంది
సీఎం కేసీఆర్పై ఎంపీ ధర్మపూరి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇళ్ల నిర్మాణంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలుకాకుండా చేశారని ఎంపీ విమర్శించారు.
Translate this News: