/rtv/media/media_files/2025/06/15/nJBY8e69kpA07abMcEOA.jpg)
Sukanya Samriddhi Yojana scheme
కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు డబ్బులు పెట్టుబడి పెడితే పెద్ద అయిన తర్వాత వారికి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్, 10 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అమ్మాయి పేరు మీద ఈ ఖాతాను తెరవొచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తుంది.
ఇది కూడా చూడండి: Coconut Barfi: ఇంట్లో కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి? భలే టెస్టీగా ఇలా చేసుకోండి
రూ.250 పెట్టుబడి పెడితే..
ఈ పథకంలో 8 శాతం వడ్డీ లభిస్తోంది. కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఏటా పెట్టుబడి పెట్టవచ్చు. దాదాపు15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. ఖాతా తెరిచిన 21 ఏళ్లకు పథకం మెచ్యూరిటీ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన భారత ప్రభుత్వానికి చెందిన అత్యంత భద్రమైన, ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చే పథకం. ఈ పథకం ద్వారా చిన్న వయస్సులోనే మీ అమ్మాయి భవిష్యత్తుకు గట్టి పునాది వేయొచ్చు.
ఇది కూడా చూడండి: G. Kishan Reddy : బీజేపీలోకి చిరంజీవి..కిషన్ రెడ్డి సంచలన ప్రకటన
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల 80C కింద ట్యాక్స్ మినహాయింపు కూడా లభిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన మీ ఆడపిల్లల ఉన్నత విద్యకు, వివాహానికి ఆర్థికంగా చేయూతనిస్తుంది. ఇది వారికి సురక్షితమైన భవిష్యత్తును అందించడానికి ఒక గొప్ప మార్గం.
ఇది కూడా చూడండి: Rishab Shetty: భారీ ప్రమాదం.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన రిషబ్ శెట్టి!
ఉదాహరణకు: మీ అమ్మాయి వయస్సు ఏడాది అనుకుందాం. మీరు నెలకు రూ. 2,000 చొప్పున (ఏడాదికి రూ. 24,000) పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలకు మొత్తం పెట్టుబడి రూ. 3,60,000 అవుతుంది. మీరు 2025లో పథకాన్ని ప్రారంభిస్తే, 2046లో పథకం మెచ్యూరిటీ అయ్యే నాటికి వడ్డీ రూపంలో రూ. 7,48,412 లభించి, మొత్తం రూ. 11,08,412 పొందవచ్చు.
ఇది కూడా చూడండి: CPI (Maoist) : 20న తెలంగాణ, ఏపీ బంద్కు పిలుపునిచ్చిన మవోయిస్టులు