Stock Market: స్టాక్ మార్కెట్ పై బలంగా వార్ దెబ్బ..25 వేల దిగువకు నిఫ్టీ

ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ దెబ్బ అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత స్టాక్ మార్కెట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఈరోజు నిఫ్టీ 141పాయింట్లు కోల్పోయి 25 వేల దిగువకు పడిపోయింది. 

New Update
stock

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ముందు ప్రభావం చూపించేది స్టాక్ మార్కెట్ల మీదనే. అందులో యుద్ధాలు అంటే ప్రపంచ వ్యాప్తంగా భయం మొదలవుతుంది. దానికి తోడు ఆ దేశాలతో ఉన్న వాణిజ్య కనెక్షన్లు దెబ్బ తింటాయి. ఈ కారణంగా చాలా దేశాల మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పోరులో అమెరికా జోక్యం చేసుకోవడంతో పాటు అక్కడి అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి పడింది. దానికి తోడు చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్ళీ పెరుగుతుందనే భయం మొదలైంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ ఢమాల్ అంది. 

ప్రారంభం నుంచి నష్టాల్లో..

ఈరోజు  సెన్సెక్స్ 511 పాయింట్లు తగ్గి 81,897 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 141 పాయింట్లు తగ్గి 24,972 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 9 పెరిగాయి మరియు 21 పడిపోయాయి. HCL టెక్, ఇన్ఫోసిస్, లార్సెన్ & టూబ్రో షేర్లు 2.3% తగ్గాయి. ట్రెంట్ మరియు BEL 3.4% పెరిగాయి.నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 35 నష్టాలతో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 1.48%, ఆటో 0.92%, ఎఫ్‌ఎంసిజి 0.74% తగ్గాయి. మీడియా 4.39% పెరిగింది. మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా లాభాలతో ముగిశాయి.

స్టాక్ మార్కెట్ ఉదయం ప్రారంభం నుంచే నష్టాల్లో ఈదులాడింది. సెన్సెక్స్‌ ఉదయం 81,704.07 పాయింట్ల దగ్గర భారీ నష్టంతో మొదలైంది. ఇంట్రాడేలో 81,476.76 వద్ద కనిష్ఠాన్ని తాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.76గా ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు