/rtv/media/media_files/2025/10/01/hurun-india-rich-2025-10-01-20-45-04.jpg)
భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా HCL టెక్నాలజీస్(HCL Technologies) చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా(Roshni Nadar) మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తాజాగా విడుదలైన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, ఆమె కుటుంబ సంపద రూ.2.84 లక్షల కోట్లుగా నమోదైంది. ఆమె దేశంలోని మొత్తం సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. హురున్ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఒక మహిళ నిలవడం ఇది మొదటిసారి కావడం విశేషం. ఈ అరుదైన ఘనతను సాధించిన రోష్ని నాడార్, దేశ ఆర్థిక రంగంలో మహిళా నాయకత్వం పెరుగుతున్న ప్రభావాన్ని చాటిచెప్పారు.
Also Read : వివో పవర్ఫుల్ 200MP కెమెరా ఫోన్.. 6,500mAh బ్యాటరీతో లాంచ్కు రెడీ మావా..
M3M Hurun India Rich List 2025
M3M Hurun India Rich List 2025 highlights India’s leading wealth creators. Mukesh Ambani & family reclaimed the top spot, Gautam Adani & family held second, and Roshni Nadar Malhotra & family debuted in the top three.Niraj Bajaj & family were standout performers,climbing six rank pic.twitter.com/XLL9FhyG94
— HURUN INDIA (@HurunReportInd) October 1, 2025
రూ. 2.84 లక్షల కోట్లు నికర సంపదతో రోష్ని నాడార్ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలవగా, మొత్తం జాబితాలో ముకేశ్ అంబానీ (రూ. 9.55 లక్షల కోట్లు), గౌతమ్ అదానీ (రూ. 8.15 లక్షల కోట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోష్ని నాడార్కు కేవలం 44 ఏళ్లే. ఆమె ఈ జాబితాలోని టాప్ 10 కుబేరులలో అతి పిన్న వయస్కురాలు కావడం విశేషం.
HCL వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తె అయిన రోష్ని, 2020లో కంపెనీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. లిస్టెడ్ ఐటీ కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. కేవలం వ్యాపారంలోనే కాక, శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా విద్య, దాతృత్వ కార్యక్రమాలలో కూడా ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. ఆమె సాధించిన ఈ మైలురాయి, భారతదేశంలో టెక్నాలజీ ఆధారిత సంపద సృష్టి, మహిళల వ్యాపార విజయాలకు నిదర్శనం.
Also Read : అదిరిపోయే వ్యాపారం.. ఇన్స్టాలో ఇలా చేస్తే.. నెలకు లక్షల లక్షల డబ్బు!