/rtv/media/media_files/2025/04/18/LXGeOP8pdXXI7FTUtTze.jpg)
infosyis frehers
Infosys Jobs: 400 మంది ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసేసిన భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జయేష్ వెల్లడించారు.
Also Read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
2025 ఆర్థిక సంవత్సరానికి 15,000 నుండి 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇక శాలరీ హైక్ ల గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీలో జీతాల పెంపు సగటున 5-8% శాతం ఉందన్నారు. మంచిగా పనిచేసిన వారికి 10-12%శాతం పెంచామని అన్నారు. జనవరిలోనే చాలామందికి శాలరీలు పెరిగాయని.. మిగితా వారికి 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
Here’s a quick breakdown of hiring vs layoffs for top Indian IT companies over the past three years:
— Ask Perplexity (@AskPerplexity) April 18, 2025
Infosys: Hired over 20,000 freshers in FY26 (planned), added 6,388 employees in FY25, but also laid off 700 trainees in FY25 mainly due to failed assessments, with attrition…
Also Read: Lady Don: హాట్ టాపిక్గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
ఉద్యోగుల తొలగింపు రేటు కూడా
అయితే, గత 12 నెలలుగా ఇన్ఫోసిస్ ఉద్యోగుల తొలగింపు రేటు కూడా డిసెంబర్ 2024 త్రైమాసికంలో 13.7% నుండి 14.1%కి పెరిగింది. కాగా ఇన్ఫోసిస్ మైసూర్ బ్రాంచ్ లో 400 మంది ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసేసింది. వీరంతా 2024 అక్టోబర్ లో కంపెనీలో చేరారు, కానీ ఉద్యోగంలో కొనసాగడానికి అవసరమైన పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోయారు.