PM Modi Vemulawada Public Meeting: తెలంగాణ జిల్లాల్లో ప్రధాని మోదీ ఈరోజు పర్యటిస్తున్నారు. ముందు కరీంనగర్ వేములవాడలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ…తరువాత వరంగల్ జిల్లాలో సబలో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన రాజ్ భవన్ లో కాసేపు విశ్రాంతి తీసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు చేరుకున్నారు. అక్కడ రాజన్నను దర్శించుకున్న తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చాను. గత పదేళ్ళలో తానేం చేశానో అందరూ చూశారు. ఎన్డీయే పాలనలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) కూడా తమ గెలుపు ఖాయమన్నారు ప్రధాని.
పూర్తిగా చదవండి..Telangana: RRR మూవీ కలెక్షన్లను దాటిన RR ట్యాక్స్.. రేవంత్ సర్కార్ పై మోదీ ఎటాక్
కరీంనగర్లో ఈసారి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం పక్కా అనిపిస్తోంది అన్నారు ప్రధాని మోదీ. బండి సంజయ్కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అంతకుముందు వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Translate this News: