Speaker Awadh Bihari Chaudhary: బిహార్ అసెంబ్లీలో కొత్తగా ఏర్పడిన జేడీయూ అధినేత.. సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar)-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం.. నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధ్ చౌదరీపై (Awadh Bihari Choudhary) ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది. మరోవైపు ఫ్లోర్ టెస్ట్ (బలపరీక్ష)పై కూడా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యేలు (RJD MLA) చేతన్ ఆనంద్, నీలమ్ దేవి, ప్రహ్లద్ యాదవ్ ..ప్రభుత్వం వైపు కూర్చోని ఆ పార్టీ అగ్రనేత తేజస్వీ యాదవ్కు (Tejashwi Yadav) షాకివ్వడం చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..Bihar Floor Test: బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష.. స్పీకర్ పదవి నుంచి ఆర్జేడీ నేత తొలగింపు
సీఎం నితీష్ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం.. నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధ్ చౌదరీపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది. దీంతో బలపరీక్షపై ఉత్కంఠ నెలకొంది.
Translate this News: