Telangana : ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించేందుకు ప్లాన్.. బండి సంజయ్!

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్ గ్యాంగ్ ఒక్కటే అన్నారు. ముస్లింలంతా ఒక్కటై తనను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నాడని మండిపడ్డారు. హిందూ బంధువులంతా తనను గెలిపించి దమ్మేందో చూపించాలన్నారు.

Telangana : ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించేందుకు ప్లాన్.. బండి సంజయ్!
New Update

Bandi Sanjay : మోడీ(PM Modi) లేకపోతే భారత్ మరో పాకిస్థాన్‌లా మారే ప్రమాదం ఉందని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్(Karimnagar) బీజేపీ(BJP) మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్(Bandi Sanjay) మాట్లాడుతూ.. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్థాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్ ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నాయని అన్నారు. నేను.. ‘హమ్ దో.. హమారే దో’ విధానానికి ఓటేస్తా.. (మేమిద్దరం.. మాకిద్దరనే కుటుంబ నియంత్రణ విధానానికి ఓటేస్తం) అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. ‘‘హమ్ చార్.. హమారే చాలీస్’’ (మేం నలుగురం.. 40 మంది పిల్లల్ని కంటాం అనే విధానం) అవుతుందన్నారు. కేసీఆర్(KCR) దేశద్రోహి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికపోతారనే భయంతో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. కేసీఆర్ లాంటి దేశద్రోహిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దేశభద్రత డేటా, దేశద్రోహంపై కేంద్రానికి నివేదిక ఎందుకు పంపలేదు? అని మండిపడ్డారు.

కేసీఆర్‌ను బొక్కలో వేసేవాళ్లం..

రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. కేసీఆర్‌ను బొక్కలో వేసే వాళ్లం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో గుసాయించి సర్జికల్ స్ట్రయిక్ చేసి దేశద్రోహులను ఏరిపారేసేవాళ్లం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్ జరిగిందనడానికి ఆధారాలేంటని రేవంత్ రెడ్డి జవాన్లను అవమానిస్తున్నాడన్నారు. రేవంతన్నా... సరిహద్దుకు తీసుకుపోతా రా... సర్టికల్ స్ట్రయిక్స్ ఎట్లా చేసారో జవాన్లే నీకు రుచి చూపిస్తరని సవాల్ విసిరారు. మోడీ లేని భారత్‌ను ఊహించుకోలేమని.. హీరో అని నువ్వే మోడీని పొగిడిన సంగతి మర్చిపోయినవా రేవంతన్న అంటూ గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: Kadapa: వైఎస్ఆర్ దేశానికి మార్గదర్శకుడు.. రాహుల్ గాంధీ!

నాపై ఏబీసీ గ్యాంగ్‌ కుట్రలు..

సౌతిండియన్లు, ఆఫ్రికన్లలాగా ఉంటామని (శ్యాంపిట్రోడాను ఉద్దేశించి) కాంగ్రెసోళ్లు అవమానిస్తుంటే ఊరుకుందామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో 60 శాతం వాటాను స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపేయండి అన్నారు. నన్ను ఓడించేందుకు ఏబీసీ(అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్) గ్యాంగ్ ఒక్కటైనయ్ అన్నారు. ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నడన్నారు. హిందూ బంధువులారా.. కరీంనగర్‌కు తరలివచ్చి నన్ను గెలిపించి మీ దమ్మేందో చూపించాలని అన్నారు.

#kcr #bandi-sanjay #cm-revanth-reddy #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe