Rahul Gandhi : ఏపీ ఎన్నికల(AP Elections) ప్రచారంలో కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడపలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. షర్మిల తన చెల్లి అన్నారు. రాజకీయాల్లో కుటుంబ సంబంధాలుంటాయని, వైఎస్సార్ తన తండ్రికి సోదరుడన్నారు. రాజీవ్, వైఎస్సార్ ఇద్దరు అన్నదమ్ముళ్లు. ఈ బంధం చాలా ఏళ్ళ క్రితం నుంచే ఉంది. వైఎస్ఆర్ దేశానికి మార్గదర్శకుడు. వైఎస్సార్ పాదయాత్ర నాకు ఆదర్శం. జోడో యాత్ర ఎందుకు స్ఫూర్తి. దేశం మొత్తం పాదయాత్ర చేయాలని వైఎస్ నాకు చెప్పారు. వైఎస్ నాకు అన్ని విషయాల్లో మార్గదర్శకుడిగా ఉన్నారు. పాదయాత్ర చేస్తే ప్రజల్లోకి వెళ్తాం అని వైఎస్సార్ నాకు చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. అందుకే భారత్ జోడో ద్వారా దేశపు వీధుల్లో తిరిగాను. వైఎస్సార్ సామాజిక న్యాయం కోసం రాజకీయం చేశాడంటూ పొగిడారు.
పూర్తిగా చదవండి..Kadapa : వైఎస్ఆర్ దేశానికి మార్గదర్శకుడు.. రాహుల్ గాంధీ!
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజీవ్, వైఎస్ఆర్ ఇద్దరు అన్నదమ్ముళ్లు. వైఎస్ఆర్ ఈ దేశానికి మార్గదర్శకుడు. వైఎస్సార్ పాదయాత్ర నాకు ఆదర్శం. నా చెల్లి షర్మిలను గెలిపించండి'అని కోరారు.
Translate this News: