YS Sharmila: ప్రతీమహిళకు రూ.8500, రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. షర్మిల సంచనల హామీ

ఏపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల 'గడప గడపకు కాంగ్రెస్ పార్టీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించారు.

New Update
Andhra Pradesh: షర్మిల పర్యటనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. అవినాష్‌ రెడ్డికి గట్టి కౌంటర్‌

AP Congress Announced 9 Guarantees: ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) 'గడప గడపకు కాంగ్రెస్ పార్టీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. అలాగే 9 గ్యారెంటీ కరపత్రం, డోర్‌ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. అంతేకాదు ఇటీవల ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పనితన ఆధారంగా ప్రాధాన్యం

'కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి పోటీ చేసేందుకు 15 వందల అప్లికేషన్లు వచ్చాయి. B ఫామ్‌లు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు 25 మంది ఎంపీ అభ్యర్థులు మాత్రమే వస్తాయి. టిక్కెట్ రాని వాళ్ళు కాంగ్రెస్ గెలుపు కోసం,ప్రజల కోసం,దేశం కోసం పని చేయాలి.దరఖాస్తు చేసుకున్న వాళ్లపై సర్వేలు చేసి, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేస్తున్నాం. అభ్యర్థి పనితనం ఆధారంగా ప్రాధాన్యత ఇస్తున్నాం. కాంగ్రెస్ జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ కాదు. కేవలం ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొనే పార్టీ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది

బాబు, జగన్‌లు బీజేపీకి బానిసలు 
దేశంలో కాంగ్రెస్ అధికారంలో రావాలి. కాంగ్రెస్ అధికారంలో లేకుంటే ఎలా ఉందో చూస్తున్నాం. మణిపూర్ లాంటి ఘటనలు ఇందుకు ఉదాహరణ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోతే చరిత్ర హీనులుగా మిగులుతాం. ప్రతి ఒక్కరం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాటు పడదాం. మన బిడ్డల భవిష్యత్ కాపాడుకుందాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గడప గడపకు గ్యారెంటీలు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇక్కడ టీడీపీ,వైసీపీ రెండు బీజేపీ తోత్తులే. బీజేపీ మేలు చేయక పోయినా బాబు,జగన్‌లు మాత్రం బానిసలుగా మారారు. ఇప్పటివరకు వరకు హోదా ఊసే లేదు.

అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా

విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు. చంద్రబాబు బీజేపీ తో 2014 లో పొత్తు పెట్టుకొని విడాకులు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. జగన్‌ను ఏకంగా నిర్మలా సీతారామన్, మోదీకి దత్తపుత్రుడు అన్నారు. ఒకరిది బహిరంగ పొత్తు. మరొకరిది రహస్య పొత్తు. బాబుకి, జగన్ ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పాలి. ప్రత్యేక హోదా 10 ఏళ్లు కావాలని చెప్పి అధికారం అనుభవించి బాబు మోసం చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేద్దామని చెప్పిన జగన్ ప్రజలను మోసం చేశాడు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగి ఉండేది. వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. రాష్ట్ర ప్రజల గౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారు. ఏపీకి హోదా (AP Special Status) ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మాత్రమే హోదాపై కట్టుబడి ఉంది. కాంగ్రెస్ గ్యారెంటిలను మనం గడప గడపకి చేర్చాలని' షర్మిల అన్నారు. అలాగే తొమ్మిది గ్యారెంటీలను (Congress 9 Guarantees) విడుదల చేశారు.

మొదటి గ్యారెంటీ
కాంగ్రెస్ అధికారంలో వస్తే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా గ్యారెంటీ
అధికారంలో వచ్చిన వెంటనే హోదా అమలు

రెండో గ్యారెంటీ
మహిళా మహాలక్ష్మి
ప్రతి పేద మహిళలకు ప్రతి నెల రూ.8500 ఇస్తాం
ఏడాదికి రూ.లక్ష రూపాయలు ఇస్తాం
ఇది మహిళకు బరోసా ఇచ్చే పథకం

మూడో గ్యారెంటీ
రైతులకు రుణమాఫీ
రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ

నాలుగవ గ్యారెంటీ
పెట్టుబడి మీద 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర

5వ గ్యారెంటీ
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం రూ.400 రూపాయలు

6వ గ్యారెంటీ
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య

7వ గ్యారెంటీ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాల భర్తీ
మొట్టమొదటి సంతకం ఉద్యోగాల మీదే

8వ గ్యారెంటీ
ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇళ్లు

9వ గ్యారెంటీ
ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్
అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పెన్షన్
వికలాంగులకు రూ.6 వేల పెన్షన్

Also Read: రేవంత్ రెడ్డితో నందమూరి సుహాసిని భేటీ.. త్వరలో కాంగ్రెస్లోకి?

Advertisment
తాజా కథనాలు