సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeshwari) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన పురందేశ్వరి విశాఖ జిల్లా పార్లమెంట్ స్థాయి మీటింగ్లో (Parliament level meeting) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు పురందేశ్వరి తెలిపారు. తాను 2004లో రాజకీయాల్లోకి వచ్చినట్లు పురందేశ్వరి తెలిపారు. గత 19 సంవత్సరాలుగా తనకు అండగా ఉంటున్న పార్టీ అగ్ర నాయకత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ దేశం కోసం పని చేస్తున్న పార్టీ అన్నారు. సబ్ కే సాత్ సబ్ కే వికాస్ (Sub K Saath Sub K Vikas) అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం అందరికీ సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోందన్నారు.
పూర్తిగా చదవండి..జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి పోయింది
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖలో పర్యటించారు. విశాఖ జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె.. పలు అంశాలతోపాటు ఉత్తరాంధ్రలో బీజేపీ బలంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రజలను బెదిరించి భూములను లాక్కుంటోందని ఆరోపించారు.
Translate this News: