జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి పోయింది
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖలో పర్యటించారు. విశాఖ జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె.. పలు అంశాలతోపాటు ఉత్తరాంధ్రలో బీజేపీ బలంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రజలను బెదిరించి భూములను లాక్కుంటోందని ఆరోపించారు.