Andhra Pradesh: ఏపీ మంత్రుల జాబితా విడుదల..లిస్ట్ ఇదే

ఏపీ కొత్త ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల జాబితా విడుదల అయింది. కేంద్ర మంత్రి అమిత్‌ షాతో సమావేశం తర్వాత మంత్రుల పేర్లు ఖరారు చేశారు. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌కు చోటు దక్కింది.

New Update
Andhra Pradesh: ఏపీ మంత్రుల జాబితా విడుదల..లిస్ట్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈరోజే ప్రమాణం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.27 ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈయనతో పాటూ ఏపీ కొత్త ప్రభుత్వంలో మొత్తం 24 మంది మంత్రులుగా బాధ్యతలు చేట్టనున్నారు. వీరి లిస్ట్‌ను నిన్న అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. ఈ 24 మందిలో జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి చోటు దక్కింది. రేపు చంద్రబాబుతో పాటూ మొత్తం 24 మందీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక జనసేన అధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రి వర్గంలో లభించింది.

కొత్త మంత్రుల లిస్ట్ ఇదే..

  1. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి)
  2. కొణిదెల పవన్ కళ్యాణ్ 
  3. కింజరాపు అచ్చెన్నాయుడు 
  4. కొల్లు రవీంద్ర 
  5. నాదెండ్ల మనోహర్
  6. పి.నారాయణ 
  7. వంగలపూడి అనిత 
  8. సత్యకుమార్ యాదవ్ 
  9. నిమ్మల రామానాయుడు 
  10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ 
  11. ఆనం రామనారాయణరెడ్డి 
  12. పయ్యావుల కేశవ్ 
  13. అనగాని సత్యప్రసాద్ 
  14. కొలుసు పార్థసారధి 
  15. డోలా బాలవీరాంజనేయస్వామి 
  16. గొట్టిపాటి రవి 
  17. కందుల దుర్గేష్ 
  18. గుమ్మడి సంధ్యారాణి 
  19. బీసీ జనార్థన్ రెడ్డి 
  20. టీజీ భరత్ 
  21. ఎస్.సవిత 
  22. వాసంశెట్టి సుభాష్ 
  23. కొండపల్లి శ్రీనివాస్ 
  24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
  25. నారా లోకేష్ 

Also Read:India Army: భారత కొత్త ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఉగ్రవాది చేతిలో రాజాసింగ్ వీడియో

విజయనగరం ఉగ్రమూలాల కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ అనే వ్యక్తికి ఒక అజ్ఞాత వ్యక్తి ప్రోత్సాహం అందించాడని పోలీసులు గుర్తించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్ చేసిన వ్యాఖ్యలను ఆ వ్యక్తి మెచ్చుకున్నాడు.

New Update
nia viayanagaram

విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్రమూలాల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు రోజులుగా నిందితులు సిరాజ్, సమీర్‌లను పోలీసులు విచారిస్తున్నారు. విజయనగరం పోలీసు ట్రెయినింగ్ అకాడమీలో శనివారం 7 గంటల పాటు విచారణ జరిగింది. అయితే ఈ విచారణలో సిరాజ్‌కు ఒక అజ్ఞాత వ్యక్తి ప్రోత్సాహం అందించినట్లుగా తేలింది.  అలాగే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్ చేసిన కామెంట్స్ కు ఆ వ్యక్తి స్పందించి ప్రశంసించాడు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వీడియోపై సిరాజ్‌ సోషల్ మీడియాలో  స్పందించాడు.

దీనిని ఒక అజ్ఞాత వ్యక్తి గుర్తించాడు. ముందుగా సిరాజ్‌ను మెచ్చుకుంటూ అతడికి మెసేజ్ వచ్చింది.  దీంతో ఇద్దరి మధ్య చాటింగ్  మొదలైంది. కొంతకాలానికి ఆ వ్యక్తి తన వివరాలను సిరాజ్‌కు చెప్పాడు. తాను విశాఖకు చెందిన రెవెన్యూ అధికారినని  పరిచయం చేసుకున్నాడు. ఒక వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్‌ను ప్రోత్సహించాడు. అధికారి పాత్ర గురించి సిరాజ్ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ అధికారి సిరాజ్‌ను ఎందుకు ప్రోత్సహించాడు? అతడి వెనుకున్న ఉద్దేశం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.  తనను ప్రశంసిస్తూ అతడి నుంచి మెసేజ్‌ వచ్చిందని సిరాజ్ పేర్కొన్నాడు. స్వయంగా అతడు ఫోన్ చేసి అభినందించినట్టుగా కూడా  తెలిపాడు.

మొత్తం ఆరుగురిని ఆదుపులోకి

ఇక ఈ కేసులో మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో త్వరలోనే బయటపడనున్నాయి. కాగా ఇప్పటివరకు  ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు ఆదుపులోకి తీసుకుని వాచారిస్తున్నారు.  ప్రధాన నిందితుడు సిరాజ్, సమీర్‌లు మరో నలుగురితో కలిసి సోషల్ మీడియాలో ఒక సిక్రెట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని చాటింగ్‌ చేసుకున్నట్టుగా  పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సిరాజ్, సమీర్ లు ఇద్దరు కలిసి.. అల్‌హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ అనే సంస్థను స్థాపించినట్టుగా విచారణలో బయటపడింది. ఈ ఆరుగురు యువకులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువకులుగా పోలీసులు తేల్చారు. వీరిని అరెస్ట్ సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైనట్లుగా పోలీసులు వెల్లడించారు.  

Advertisment
Advertisment
Advertisment