YS Sharmila: 10 ఏళ్లలో ఏపీని నాశనం చేశారు.. చంద్రబాబు, జగన్‌పై షర్మిల ఫైర్

డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీ మారిందని అన్నారు షర్మిల. మొదటి ఐదు ఏళ్లు టీడీపీ ,తర్వాత 5 ఏళ్లు వైసీపీ..10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ రావడంపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

New Update
YS Sharmila: సీఎం జగన్ పై షర్మిల విమర్శల బాణం

YS Sharmila: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అని అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇప్పుడు యావత్ డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీ మారిందని ధ్వజమెత్తారు. గంజా, హెరాయిన్,కొకైన్ ఏది కావాలంటే అది దొరికే "ఉడ్తా ఆంధ్రప్రదేశ్" అని అన్నారు. ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపి వైపే అని పేర్కొన్నారు.

ALSO READ: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బరిలో సంచలన నేత

మొత్తం 10 ఏళ్లలో..

మొదటి ఐదు ఏళ్లు టీడీపీ ,తర్వాత 5 ఏళ్లు వైసీపీ..10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని ఫైర్ అయ్యారు షర్మిల. డ్రగ్స్ రవాణా, వాడకంలో నెంబర్ 1 ముద్ర వేశారని అన్నారు. 25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే... తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు సిగ్గుండాలని చురకలు అంటించారు. కేంద్ర రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా...వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి? అని ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో మీకు లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా ? మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపి "సేఫ్ హెవెన్" గా మార్చింది ? అని నిలదీశారు.

సీబీఐ విచారణ..

బ్రెజిల్ నుంచి ఏపీలోకి భారీగా డ్రగ్స్ రావడంపై తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐ నీ కోరుతున్నట్లు షర్మిల అన్నారు. ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు, పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు