/rtv/media/media_files/2025/06/08/RXZYEPQKKptjKZvusUOX.jpg)
YSRCP Mayor Kavati Manohar
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ను తొలగించింది. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 10 మంది కౌన్సిలర్లు, శాంతిపురం జడ్పీటీసీ సహా మొత్తం 16 మందిని పార్టీ నుంచి తీసివేసింది.
Also Read: పెళ్లి మండపంలోనే భర్తను చెప్పుతో కొట్టిన భార్య.. సినిమాను మించిన ట్విస్ట్!
కావటి మనోహర్ నాయుడు గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కొంతకాల క్రితం గుంటూరు నగర మేయర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ హైకమాండ్ ఆయన్ని సస్పెండ్ చేయడం చర్చనీయాంశమవుతోంది.
Also Read: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యం.. కొనసాగుతున్న భారత్, మంగోలియా సంయుక్త మిలటరీ డ్రిల్..