Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత..వేదికపై కుప్పకూలి...

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు.. చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్న బొత్స..వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

New Update
BOTSA SATYANARAYANA

BOTSA SATYANARAYANA

Botsa Satyanarayana: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు.. చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్న బొత్స.. వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. బొత్స సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కూడా నిరసన కార్యక్రమం నిర్వహించారు. బొత్స సత్యనారాయణతో పాటూ ఇతర నేతలు వాహనంపై నిలబడి ప్రసంగించారు. ఈ క్రమంలో బొత్స ప్రసంగం చేస్తూ అలాగే ఒక్కసారిగా కూలబడిపోయారు.. వెంటనే గమనించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ను అక్కడి నుంచి వాహనంలో గరివిడి ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని.. వడదెబ్బ తగలడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.

Also Read: 'ట్రంప్‌కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు

కాగా అంతకుముందు చీపురుపల్లిలోని స్థానిక కొత్త పెట్రోల్ బంక్ నుంచి సుమారు కిలోమీటరన్నర వరకు ఎండలోనే ర్యాలీని నిర్వహించారు వైఎస్సార్‌సీపీ నేతలు. బొత్స సత్యనారాయణ కూడా  కాలినడకన మూడు రోడ్ల జంక్షన్ వరకు అందరితో కలిసి నడిచారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ ప్రచార వాహనంపైకి ఎక్కి మాట్లాడుతుండగా ఒక్కసారిగా బొత్స సత్యనారాయణ కుప్పకూలిపోయారు. కాగా ఎండలో నడవడంతో పాటు అలసిపోవడం వల్ల కొంత డీ హైడ్రెషన్‌కు గురయినట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యుల చెప్పడంతో కార్యకర్తులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read: ఆర్మీ సమాచారం లీక్‌.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

కాగా ఏపీలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూవైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగింది. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు గతేడాది ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్‌ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు.. భారీగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు వైసీపీ నేతలు.

Also Read: ఏం మనిషివిరా..  తినేది ఇండియా సొమ్ము..పాకిస్తాన్కు గూఢచర్యం

Advertisment
Advertisment
తాజా కథనాలు