/rtv/media/media_files/2025/06/04/32DjBGuQEKDgJ8yD9z29.jpg)
BOTSA SATYANARAYANA
Also Read: 'ట్రంప్కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు
కాగా అంతకుముందు చీపురుపల్లిలోని స్థానిక కొత్త పెట్రోల్ బంక్ నుంచి సుమారు కిలోమీటరన్నర వరకు ఎండలోనే ర్యాలీని నిర్వహించారు వైఎస్సార్సీపీ నేతలు. బొత్స సత్యనారాయణ కూడా కాలినడకన మూడు రోడ్ల జంక్షన్ వరకు అందరితో కలిసి నడిచారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ ప్రచార వాహనంపైకి ఎక్కి మాట్లాడుతుండగా ఒక్కసారిగా బొత్స సత్యనారాయణ కుప్పకూలిపోయారు. కాగా ఎండలో నడవడంతో పాటు అలసిపోవడం వల్ల కొంత డీ హైడ్రెషన్కు గురయినట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యుల చెప్పడంతో కార్యకర్తులు ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: ఆర్మీ సమాచారం లీక్.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
కాగా ఏపీలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూవైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు గతేడాది ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు.. భారీగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.
Also Read: ఏం మనిషివిరా.. తినేది ఇండియా సొమ్ము..పాకిస్తాన్కు గూఢచర్యం