/rtv/media/media_files/2025/08/16/ys-jagan-2025-08-16-10-14-20.jpg)
పులివెందుల ZPTC ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ ఛీప్ వైఎస్ జగన్ పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన జగన్.. అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అంటూ రాసుకొచ్చారు. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని జగన్ పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. పులివెందుల ZPTC ఉప ఎన్నిక ఫలితంపై జగన్ ఈ విధంగా స్పందించి ఉంటారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.
"అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం." ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025
రెండు చోట్ల టీడీపీ విక్టరీ
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విజయం సాధించింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి 6,035 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో వై.ఎస్.ఆర్.సి.పి కుటుంబం ప్రాబల్యాన్ని ఛేదించి, టీడీపీ తొలి విజయాన్ని సాధించింది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. అయితే ఈ ఉపఎన్నికల ఫలితాలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికలలో రిగ్గింగ్, దౌర్జన్యాలు జరిగాయని, టీడీపీ ఓటర్లను తరలించిందని ఆరోపించింది. కొన్ని పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేసింది.
Also read : TSLPRB: తెలంగాణలో118 APP పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల