YS Jagan: అయ్యో జగన్.. రెండు రోజుల్లో మూడు షాకులు.. సొంత జిల్లాలో దెబ్బ మీద దెబ్బ!

కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర YCPకి రాజీనామా చేశారు. TDP లేదా జనసేనలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నిన్న ఇదే జిల్లాకు చెందిన MLC మయానా జకియా ఖనమ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు పార్టీకి చెందిన కడప మేయర్ పై అనర్హత వేటు పడింది.

New Update
YS Jagan Mydukur Muncipal Chairman Resigns to YCP

YS Jagan Mydukur Muncipal Chairman Resigns to YCP

వైసీపీ అధినేత జగన్ కు సొంత జిల్లా కడపలో వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న రాయచోటి నియోజకవర్గానికి చెందిన శాసన మండలి డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌ మయానా జకియా ఖనమ్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలుగా అధినేత జగన్ ను కలవడానికి తాను ప్రయత్నిస్తున్నానన్నారు. కానీ స్థానిక మాజీ ఎమ్మెల్యే సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్ర గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగన్ నిర్వహించిన మీటింగ్ కు సైతం హాజరుకాలేదు. జనసేన లేదా టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కడప జిల్లాలో ప్రచారం  సాగుతోంది. దీంతో కూటమి ఖాతాలో మరో మున్సిపల్ చైర్మన్ పదవి చేరనుంది. 

Also Read :  సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు.. సంచలన లేఖ!

Also Read :  ఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష.. నరసరావుపేట కోర్టు సంచలన తీర్పు!

నిన్న కడప మేయర్ పై వేటు..

ఇదిలా ఉంటే.. వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్‌ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ నిన్న జీవో విడుదల చేశారు. సురేష్ బాబు తన కుటుంబానికి చెందిన ఎంఎస్ వర్ధిని కనస్ట్రక్షన్ సంస్థ ద్వారా కడప నగరంలో వివిధ అభివృద్ధి పనులను చేయించినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో పురపాలక చట్టం నిబంధనలు పాటించనందుకు ఆయనపై వేటు వేశారు. దీంతో వైసీపీ ఖాతాలో నుంచి మరో మేయర్ పదవి చేజారి పోయింది.

Also Read :  పాక్ అణు స్థావరాన్ని దెబ్బ కొట్టిన భారత్.. సంచలన ప్రకటన!

Also Read :  షెడ్లో నక్కిన టెర్రరిస్టులు.. షాకింగ్ వీడియోలు!

(telugu-news | latest-telugu-news | YS Jagan)

Advertisment
Advertisment
తాజా కథనాలు