/rtv/media/media_files/2025/05/26/4PyeK7315BmIWioH8gjr.jpg)
Vallabhaneni Vamsi Mohan
Vallabhaneni Vamsi : పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. చాలా రోజులుగా ఆయన తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను ఇవాళ గుంటూరు జీజీహెచ్ కు తరలించి పరీక్షలు నిర్వహించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు జీజీహెచ్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ మేరకు వంశీ హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: ఏసీ గది నుంచి నేరుగా ఎండలోకి వెళ్తున్నరా..? అయితే మీ ఆరోగ్యానికి..!!
న్యూరాలజీ సమస్యలతో కూడా బాధపడుతున్న వల్లభనేని వంశీని విజయవాడ జీజీహెచ్ కు తరలించాల్సి ఉండగా.. అక్కడ స్పెషలిస్టులు లేరనే కారణంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో విస్తుపోయే నిజాలు భయటపడ్డాయి. వంశీ కి ఫిట్స్ ఉన్నాయని, నిద్రపోయేటప్పుడు శ్వాస ఆగిపోతూ ఉంటుందని చెప్పారు. దీనికి స్లీప్ టెస్ట్ చేసి చికిత్స అందించాల్సి ఉంటుంది అన్నారు. అయితే తమ ఆసుపత్రిలో ఆ సదుపాయం లేకపోవటంతో ఇతర ఆసుపత్రికి రిఫర్ చేశామన్నారు. ఇవాళ జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ ఆయనకు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారన్నారు. దీంతో స్విమ్స్ లేదా ఆయన కోరుకున్న మరో ఆస్పత్రిలో స్లీప్ టెస్ట్ నిర్వహించేలా రిఫర్ చేశామన్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్డేట్.. పుతిన్ హెలికాప్టర్పై ఉక్రెయిన్ బాంబు దాడి !
కాగా వంశీ ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పోలీసులు మాత్రం పోలీసు స్టేషన్లు, కోర్టులు, ఆస్పత్రులకు అని తిప్పుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై వంశీ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. అయితే ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సి ఉన్నా కావాలనే సదుపాయాలు లేని ప్రభుత్వ ఆస్పత్రులకు తిప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్లోనే (VIDEO)
Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు