/rtv/media/media_files/2025/05/16/JspDl8kT6kHC4TucQxVH.jpg)
Heart attack
Heart attack : ఈ మధ్య చావు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. డ్రైవింగ్లో ఉన్న సమయంలోనో, ఏదో విందులో ఉన్న సమయంలోనో, ఆడుకుంటూనో హఠాత్తుగా గుండెపోటుకు గురవుతూ చనిపోతున్నారు. అందులోనూ గుండెపోటుకు వయసుతో సంబంధం లేకుండా పోతుంది. అలాంటిదే ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read : హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా డీజే పాటలు పెట్టి యువతీ, యవకులు ఆనందంగా నృత్యాలు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న పెళ్లింటి బంధువు అయిన బంగారు నాయుడు డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. స్టెప్పులేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
Also Read: KINGDOM: రౌడీ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!
బంగారు నాయుడు అందరితో పాటు డీజే పాటలకు డ్యాన్సు చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన తోటి స్నేహితులు, బంధువులు ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బంగారు నాయుడు మృతికి గుండెపోటు కారణమని వైద్యలు వివరించారు. అప్పటి వరకూ అందరితో ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ ఆనందంగా గడిపిన బంగారు నాయుడు అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా చనిపోవడం స్థానికులను కలిచివేసింది. దీంతో పెళ్లింట విషాదం నెలకొన్నది. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read : కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం..!
వ్యవసాయ కుటుంబానికి చెందిన బంగారునాయుడు జీవనోపాధిలో భాగంగా పెయింటర్గా పనిచేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య నాగమణితో పాటు ఇద్దరు అమ్మాయిలు, వృద్ధులైన తల్లిదండ్రులు చిన లక్ష్ముంనాయుడు, పార్వతి ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన బంగారునాయుడి మరణంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే బంగారునాయుడి అంత్యక్రియలకు గురువారం గ్రామస్తులంతా హాజరై తమ సంతాపం తెలిపారు.