Road Accident : పల్నాడు జిల్లాలో బోల్తా పడ్డ ట్రాక్టర్‌, నలుగురు మృతి

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం  సంభవించింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా మిర్చి కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఆదివారం ఉదయం వెళ్లారు.

New Update
Road Accident

Road Accident

Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం  సంభవించింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా మిర్చి కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఆదివారం ఉదయం వెళ్లారు. ఎప్పటిలాగానే రోజంతా పని చేసిన కూలీలు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నారు.ఈ క్రమంలో ట్రాక్టర్ కొద్ది దూరం ప్రయాణించాక ముప్పాళ్ళ మండలం బోల్లవరం దగ్గర అదుపు తప్పి బోల్తాపడింది.

Also Read: Delhi Elections: ఓటమి...గెలుపు...రెండిటికీ ఆయనే కారణం


ఈ ప్రమాదంలో గంగమ్మ ( 55)సామ్రాజ్యం(50) మాధవి(25) ,పద్మ (45) అనే నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కుటుంబసభ్యుల మరణవార్త విని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని బోరున విలపించారు. గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో చాగంటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also read: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

Also Read: ఆప్‌ ఓటమిపై స్పందించిన ధ్రువ్‌ రాఠీ.. బీజేపీపై విమర్శలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు