/rtv/media/media_files/2025/03/13/XrE3dLKEgPrWBnwoO6kU.jpg)
ap news
AP News: కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో అపచారం జరిగింది. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి. రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన రామ చిలుక దహనంపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రామ చిలుక దహనంపై..
శ్రీశైలంలో అపచారం..
— RTV (@RTVnewsnetwork) March 13, 2025
దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామదహనం కార్యక్రమంపై మండిపడుతున్న భక్తులు
మన్మధుడితో పాటు ఆయన వాహనమైన రామచిలుకను దహనం చేయడాన్ని తప్పుడుతున్న హిందూ సంఘాలు
రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన రామచిలుక దహనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ ధార్మిక సంఘాలు
ఈ… pic.twitter.com/BuQJhjYxZP
రామ చిలుక దహణంపై శ్రీశైలం దేవస్థానం అర్చకులు, ఆలయ అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. హిందూ సమాజానికీ ఎలాంటి సందేశం ఇస్తున్నారని హైందవ సంఘాల నేత రవీందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం పండితులు, వైదిక కమిటీ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కడపలో దారుణం.. వృద్ధురాలి గొంతు కోసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ!