/rtv/media/media_files/2025/04/30/QlHn7rLtAcZ2Xeigv6Cw.jpeg)
Simhachalam Temple Tragedy Live Updates
Simhachalam Temple Tragedy: సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్లో సిమెంట్ గోడ కూలింది.
Also Read: సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
విశాఖ జిల్లా సింహాచలం చందనోత్సవంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు లైన్లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది స్పాట్లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్లో సిమెంట్ గోడ కూలింది.
Also Read: అత్యాచారం చేసిన యువతినే పెళ్లిచేసుకున్న ఖైదీ.. జైల్లో ఉండగానే ట్విస్ట్ అదిరింది!
వెంటనే అధికారులు అక్కడిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్
కింజరాపు అచ్చెన్నాయుడు..
ఈ ఘటనపై కింజరాపు అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
-
Apr 30, 2025 13:25 IST
సింహాచలం ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
*⃣సింహాద్రి అప్పన్న చందనోత్సవం లో గోడ కూలి ప్రాణ నష్టం సంభవించడంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము pic.twitter.com/1i9YdfLz7f
— AIR News Hyderabad (@airnews_hyd) April 30, 2025 -
Apr 30, 2025 11:47 IST
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం-ఆనం రామనారాయణ రెడ్డి
పిడుగులు, గాలివాన బీభత్సంతో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
— Telugu Desam Party (@JaiTDP) April 30, 2025
సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం అందించనున్నాం.
- ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి #AndhraPradesh pic.twitter.com/p3ODXXbyFi -
Apr 30, 2025 11:32 IST
సింహాచలం ప్రమాదంపై పవన్ కీలక ప్రకటన!
సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం… pic.twitter.com/BwzjHrZUJF
— RTV (@RTVnewsnetwork) April 30, 2025 -
Apr 30, 2025 11:25 IST
సంహాచలం మృతులకు నేడు జగన్ పరామర్శ
30.04.2025
— YSR Congress Party (@YSRCParty) April 30, 2025
తాడేపల్లి
సింహాచలం చందనోత్సవంలో మరణించిన భక్తుల కుటుంబాలను పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ @ysjagan
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విశాఖ చేరుకుని సింహాచలం దేవస్ధానం చందనోత్సవంలో మరణించిన భక్తుల కుటుంబాలను శ్రీ వైయస్ జగన్… -
Apr 30, 2025 10:07 IST
మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల పరిహారం.. గాయాలైన వారికి రూ.50 వేలు
Visakhapatnam wall collapse: PM Modi expresses grief; announces Rs. 2L for kin of deceased, Rs. 50k for the injured
— ANI Digital (@ani_digital) April 30, 2025
Read @ANI Story |https://t.co/wIL4UJMqVK#PMModi #Visakhapatnam #structurecollapse #temple pic.twitter.com/yxWapuPdjm -
Apr 30, 2025 10:00 IST
Simhachalam: దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించిన హోంమంత్రి అనిత, కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్జీ
సింహాచలం ప్రమాద ఘటనాస్థలి దగ్గర NDRF, SDRF, ఫైర్, పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించిన హోంమంత్రి అనిత, కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్జీ.#AndhraPradesh pic.twitter.com/PVZhtqCfyG
— Telugu Desam Party (@JaiTDP) April 30, 2025 -
Apr 30, 2025 09:59 IST
జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్న సిఎం
-
Apr 30, 2025 09:59 IST
Simhachalam Temple Tragedy:
టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపి భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు
-
Apr 30, 2025 09:58 IST
సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
-
Apr 30, 2025 09:46 IST
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ
-
Apr 30, 2025 09:45 IST
క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం
-
Apr 30, 2025 09:45 IST
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
-
Apr 30, 2025 09:44 IST
పీఎం సహాయక నిధి నుండి ఎక్స్గ్రేషియా
-
Apr 30, 2025 09:42 IST
PM MODI: సింహాచలం ఘటనపై విచారం వ్యక్తం చేసిన పీఎం మోడీ
-
Apr 30, 2025 09:02 IST
బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-
Apr 30, 2025 08:59 IST
గోడ నిర్మాణం పై కమిటీ నివేదిక ఇస్తుంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-
Apr 30, 2025 08:56 IST
జిల్లా కలెక్టర్ సమక్షంలో పనిచేయనున్న విచారణ కమిటీ
-
Apr 30, 2025 08:56 IST
రెవెన్యూ, ఇంజినీరింగ్ నిపుణులతో కాసేపట్లో ఘటనా స్థలానికి విచారణ కమిటీ
-
Apr 30, 2025 08:53 IST
ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు
-
Apr 30, 2025 08:52 IST
గాయపడిన వారికి రూ .3 లక్షల చొప్పున పరిహారం
-
Apr 30, 2025 08:51 IST
మృతుల కుటుంబాలకు రూ . 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
-
Apr 30, 2025 08:50 IST
బాధిత కుటుంబాలకు దేవాదాయ శాఖ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశం
-
Apr 30, 2025 08:49 IST
సింహాచలం ఘటనపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
-
Apr 30, 2025 08:48 IST
సింహాచలం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
-
Apr 30, 2025 08:45 IST
Simhachalam Temple Tragedy:
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి
— AppalaNaiduKellaiTdp (@AppalaNaiduKe12) April 30, 2025
సింహాచలం ఆలయం వద్ద ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి
సింహాచలంలో భారీగా కురిసిన వర్షానికి భక్తులపై కూలిన గోడ
రూ.300 టికెట్ కౌంటర్ వద్ద భక్తులపై కూలిన గోడ, ఏడుగురు మృతి pic.twitter.com/eTjG3pGaeo -
Apr 30, 2025 08:45 IST
Simhachalam Temple Tragedy:
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి-
— C L N Raju (@clnraju) April 30, 2025
గాలి వానకు కూలిన భారీ గోడ- ఏడుగురు మృతి- కొనసాగుతున్న సహాయక చర్యలు. #simhachalam #accident pic.twitter.com/15aUdoiLHa -
Apr 30, 2025 08:33 IST
Y.S Jagan: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
30.04.2025
— YSR Congress Party (@YSRCParty) April 30, 2025
తాడేపల్లి
సింహాచలం చందనోత్సవంలో భక్తుల మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ @ysjagan దిగ్భ్రాంతి
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్… -
Apr 30, 2025 08:29 IST
Dr. CM Ramesh: సింహాచలం ఘటన దిగ్భ్రాంతికరం..
సింహాచలం ఘటన దిగ్భ్రాంతికరం.. గోడ కూలి 7 మంది మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
— Dr. CM Ramesh (@CMRamesh_MP) April 30, 2025 -
Apr 30, 2025 08:24 IST
Revanth Reddy: సింహాచలం ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం
ఆంధ్ర ప్రదేశ్ లోని
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025
సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి
భక్తులు మరణించిన ఘటన
తీవ్ర ఆవేదనను కలిగించింది.
వారి కుటుంబ సభ్యులకు
నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…
భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. -
Apr 30, 2025 08:02 IST
Simhachalam Temple Tragedy: మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అచ్చెన్నాయుడు
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులకు…
— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 30, 2025 -
Apr 30, 2025 07:57 IST
BIG BREAKING: సింహాచలం గోడకూలిన ఘటన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
Apr 30, 2025 07:46 IST
Simhachalam Temple Tragedy Live Updates:
మృతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్న....
— I & PR Andhra Pradesh (@IPR_AP) April 30, 2025
గాయపడిన వారికీ తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశాము...
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, సింహాచలంలోని ఘాట్ రోడ్డులో జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.
మంగళవారం కురిసిన భారీ వర్షానికి -
Apr 30, 2025 07:45 IST
Simhachalam: మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: సీఎం చంద్రబాబు
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలచి వేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడం తో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితి పై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స…
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2025