/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-8-3-jpg.webp)
Sajjala Rama Krishna Reddy : వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణరెడ్డి కి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణాజిల్లా పామర్రులో వైసీపీ కార్యకర్తల నుంచి ఊహించని ఘటన ఎదురైంది.
Also Read: ఏపీ మంత్రి సుభాష్ కు తప్పిన పెను ప్రమాదం!
కష్టకాలంలో అండగా ఉండాల్సిన నాయకులే పట్టించుకోకపోతే ఎలా అని వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీశారు. కృష్ణాజిల్లా పామర్రులో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంటికి సజ్జల వచ్చారు. ఈ విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
నేతలతో మాట్లాడి ఆయన వెళ్లిపోతుండగా కార్యకర్తలు అడ్డుకుని నిలదీశారు. ఇంతమంది కార్యకర్తలు వస్తే కనీసం పలకరించకుండా వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. ధైర్యంగా ఉండి పార్టీ కోసం పోరాడాలనే భరోసా ఇవ్వకుండా అలా ఎలా వెళ్లిపోతారని నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక సజ్జలతో పాటు అక్కడి నేతలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
Also Read: బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టులు వార్నింగ్!
జగన్కు బై..బై! జనసేనలోకి విడదల రజిని!
విడదల రజిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. ప్రత్యర్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవ్వడంతో ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు విడదల రజిని సైతం అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి విడదల రజిని వైసీపీకి గుడ్బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనసేనలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి.. రజిని కలిసి చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో విడుదల రజిని అనుచరులు రియాక్ట్ అవుతున్నారు. పార్టీ మార్పు లేదంటూ వారు చెబుతున్నారు.
Also Read: నాపై డ్రగ్స్ కుట్ర చేశారు..ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు
పొలిటికల్ ఎంట్రీ
2014 ఎన్నికల సమయంలో విడదల రజినీ ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడి నుంచి రజిని రాజకీయ ప్రస్తానం మొదలైంది. నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో కలిసిపోయారు. రజిని తెలుగు, హిందీ, ఇంగ్లిష్లో చక చకా మాట్లాడటంతో ఆమె ప్రతిభను గుర్తించిన ప్రత్తిపాటి పుల్లారావు 2017లో వైజాగ్ లోని మహానాడులో రజినితో మాట్లాడించారు.
అందులో విడదల రజినీ తన ప్రసంగంతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించింది. దీంతో ఒక్కసారిగా రజిని పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలా ఓ వైపు పాపులారిటీ తెచ్చుకుంటూనే మరోవైపు విఆర్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో 2019 ఎన్నికల్లో తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కానీ తనకు టికెట్ ఇవ్వలేనని చంద్రబాబు చెప్పేశారు.
దీంతో విడదల రజినీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వైసీపీ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి ఎన్నికల్లోనే టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అదే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన విడదల రజినినీ 2022 ఏప్రిల్ 11న జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆమెకు వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం ఇచ్చారు.
Also Read: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వానలు
AP News: ఆ రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లతో జగన్ దోస్తీ.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!
విజయవాడ జగన్, సజ్జలపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జాగన్కి, సజ్జల రామకృష్ణారెడ్డికి లేదన్నారు. రౌడీ షీటర్లకు, గంజాయి సరఫరా చేసే వారికి వైసీపీ మద్దతుగా నిలుస్తోందని ఫైర్ అయ్యారు.
Home Minister Vangalapudi Anitha
AP politics: హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో విలేకరులతో అనిత మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వారికే లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా పెరిగిందని విమర్శించారు. ఈ అక్రమాలకు గంజాయి సరఫరాదారులు, రౌడీషీటర్లకు వైసీపీ మద్దతిచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
ప్రజల భద్రతే మాకు ముఖ్యం..
జగన్ తెనాలిలోని రౌడీషీటర్లను కలవడానికి స్వయంగా వెళ్లిన సంఘటనను గుర్తు చేశారు. ఇది వైసీపీ నేతల అసలైన ముఖచిత్రాన్ని బయటపెడుతోంది అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు రెచ్చగొట్టి, కూటమి ప్రభుత్వానికి అపఖ్యాతి తీసుకురావాలని కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. అయితే ప్రభుత్వం అలాంటి ఏ ప్రయత్నాలను సహించబోదని ప్రజల మద్దతుతో బలంగా నిలబడుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఇది కేవలం స్టేషన్ కాదని కార్పొరేట్ మాదిరిగా సౌకర్యాలతో నిర్మించిన మోడల్ స్టేషన్ అని తెలిపారు. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ అంటే ప్రజల్లో భయం ఉండేదని.. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిందన్నారు.
ఇది కూడా చదవండి: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్ను పాడు చేస్తుందా?
రెండు లక్షల యాభై వేల రూపాయల నిధులతో ఈ పోలీస్ స్టేషన్ నిర్మించబడిందని తెలిపారు. శారీరక, మానసిక ఒత్తిడిని తట్టుకునే విధంగా పోలీసులకు ప్రత్యేక వ్యాయామ కేంద్రం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఇన్విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి రవాణాపై నిఘా పెంచామని తెలిపారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా తీసుకుందని.. ఇకపై ప్రజల భద్రతే మాకు ముఖ్యమని హోంమంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మీ స్కిన్ నిగనిగలాడలా? ఈ పానీయాలకు దూరంగా ఉండండి
( ap political | AP Political News | Latest News | home-minister | vangalapudi-anita | vangalapudi anitha latest | vangalapudi anitha latest news)
Comedian Ali: రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అలీ షాకింగ్ రియాక్షన్-VIDEO
దడ పుట్టిస్తున్న కరోనా మ*ర*ణాలు | Corona Updates | Positive Cases Increasing
రేవంత్ కేబినెట్లో విజయశాంతి | Vijayashanti in Telangana Cabinet | Addanki Dayakar
నీళ్లు ఆపితే యుద్ధమే రెచ్చగొడుతున్న పాక్! | India Pakistan War Updates | Sindhu Water Issue
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.! | Rain Alert To AP and Telangana |RTV