/rtv/media/media_files/2025/06/12/loGCAiTWprwdrNuUNqlw.jpg)
Talliki Vandanam
Thalliki vandanam : ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో అతి ముఖ్యమైన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
ఎన్నికల కు ముందు సూపర్ సిక్స్ లో అతి కీలకమైన పథకం తల్లీ కి వందనం అన్న చంద్రబాబు,రూ.10,091 కోట్లలో రూ.1300 వందల కోట్లు పాఠశాల అభివృద్ధి కి కేటాయిస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఏ ఏ నిబంధనలు పాటించారు ఇప్పుడు అవే వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. సంపద సృష్టించి ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.గతంలో ‘అమ్మఒడి’కి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నాం. అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే.. ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ ఇస్తున్నామని ఎపీ సీఎం తెలిపారు.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్పై కీలక నిర్ణయం!
గత ప్రభుత్వం 42,61,965 మందికి మాత్రమే అమ్మ ఒడి కింద ఇస్తే.. మేం 67,27,164 మందికి వర్తింపజేశాం. ఇంట్లో ఒకరికి ఇస్తే మిగిలిన వారికి ఇబ్బంది అవుతుందని అందరికీ ఇస్తున్నామని సీఎం తెలిపారు. అప్పటితో పోలిస్తే అదనంగా 24,65,199 మందికి ఇస్తున్నాం. అప్పుడు రూ.5,540 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు రూ.8,745 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అంటే గతం కంటే రూ.3,205 కోట్లు అదనంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తల్లి ఖాతాలోనే రూ.15000 వేస్తున్నాం. ఒక వేళ తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో జమచేస్తాం. అనాథలకు జిల్లా కలెక్టర్ నిర్ధరించిన ప్రకారం వారి ఖాతాల్లో వేస్తాని స్పష్టం చేశారు. తల్లికి వందనం జాబితాలను గ్రామ,వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచమన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరిదిద్ది సహాయం అందిస్తాం. దానికోసం జూన్ 26 వరకు ఫిర్యాదులు స్వీకరించి 30న తుది జాబితాను ప్రకటిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు. అడ్మిషన్లు అయ్యాక 1 తరగతి... కి కూడా డబ్బులు అందుతాయి. గతం లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే రాజకీయాలలో పోటీ కి అనర్హులు. కానీ ఇక పై తక్కువ పిల్లలు ఉంటే అనర్హులుగా ఉండేలా చట్టాలు వస్తాయని చంద్రబాబు అన్నారు.
బటన్ నొక్కుతున్న అంటూ గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేశారన్నారు,.రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఉద్యోగులకు సరైనా జీతాలు కూడా గత ప్రభుత్వం ఉవ్వలేకపోయిందని ఆరోపించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా 4కోట్ల మంది ఆకలి తీరుస్తోందన్నారు.నిరుద్యోగ భృతి కూడా వీలైనంత త్వరగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తామన్నారు.రాష్ట్రం లో ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన పాలన అందించాలన్నది కూటమి సర్కార్ లక్ష్యం అని చంద్రబాబు తెలిపారు.
Also Read : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!