KA Paul: పాస్టర్ ప్రవీణ్ చావుకు పవన్ కల్యాణే కారణం.. ఇదే సాక్ష్యం అంటున్న కేఏపాల్!

పాస్టర్ ప్రవీణ్ అకాల మరణం ఇష్యూలో పవన్ కల్యాణ్‌పై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం అంటూ జనాలను రెచ్చగొట్టి ఇలాంటి దాడులకు పరోక్షంగా కారణం అవుతున్నారన్నారు. పవన్ ప్రసంగాల వల్ల సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందన్నారు.

New Update

KA Paul: పాస్టర్ ప్రవీణ్ అకాల మరణం ఇష్యూలో పవన్ కల్యాణ్‌పై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం అంటూ ఇటీవల ప్రచారం చేస్తున్న పవన్.. ప్రవీణ్ హత్యలో పరోక్షంగా భాగస్వాములేనన్నారు. జనాలను రెచ్చగొట్టేలా మత ప్రసంగాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా జనసేన కార్యకర్తలు మాత్రం పాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. 

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

ఇదిలా ఉంటే.. ప్రవీణ్‌ పగడాల మృతి వెనుక తనకు అనుమానాలు ఉన్నాయని మహాసేన రాజేష్ చెప్పారు. పోలీసులు ఎప్పటికప్పుడూ వివరాలు చెప్పకుండా తాత్సారం చేయడంతో అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వారికి శత్రువులు ఉంటారనన్నారు. అలాంటి లక్షణం ఉన్న ప్రవీణ్‌ పగడాలను ఎవరైనా చంపేసి ఉండొచ్చన్నారు. తాను కూడా మొదటగా పోలీసులు చెప్పినట్లు యాక్సిడెంట్ అని నమ్మానన్నారు. కానీ పోలీసుల తీరుతో తన అభిప్రాయం మారిందన్నారు. సీసీ టీవీని పోలీసులు ఎందుకు విడుదల చేయడం లేదు? ఆ రెడ్ కారు ఎవరది? అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీవీకి రాజేష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

Also Readఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

telugu-news | today telugu news 

Advertisment
Advertisment
తాజా కథనాలు