Road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు

ఏపీలోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున  రేణిగుంట నారాయణ కాలేజీ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఉద్యోగులతో వెళ్తున్న అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది.

New Update
Road Accident:

Road Accident:

Road accident : ఏపీలోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున  రేణిగుంట నారాయణ కాలేజీ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఉద్యోగులతో వెళ్తున్న అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది. వేకువ జామున జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగిని(25) మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి.

ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను  రేణిగుంట అర్బన్ డిఎస్పి శ్రీనివాసరావు స్థానికులను, ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

Also Read: ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్లో వందేభారత్‌కు మరో 4 కోచ్‌లు

Advertisment
Advertisment
తాజా కథనాలు