Alekhya Chitti Pickles Issue: బలుపు ఎక్కువైంది.. అలేఖ్య చిట్టి పై యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ వ్యాఖ్యలు!

అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీపై యూట్యూబర్ నా అన్వేష్ స్పందించాడు. ‘అలేఖ్య అలా తిట్టి ఉండకూడదు. వాళ్లు నా చెల్లెల్లాంటివారు. వారిని క్షమించండి. వారి కర్మబాగోలేక, బలుపు ఎక్కువై అలా చేసింది. త్వరలో లడ్డూ బిజినెస్ పెట్టబోతున్నారు’ అని చెప్పుకొచ్చాడు.

New Update
Naa Anveshana Reaction on Alekhya Chitti Pickles Controversy

Naa Anveshana Reaction on Alekhya Chitti Pickles Controversy

గత మూడు రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి ఆడియో రచ్చ రచ్చ చేస్తుంది. పచ్చళ్లు రేటు ఎక్కువగా ఉన్నాయని అడిగిన కస్టమర్లపై అలేఖ్య బూతులతో రెచ్చిపోయిన విధానం నెటిజన్లను చిర్రెత్తించింది. ప్రస్తుతం ఇదే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

నా అన్వేష్ షాకింగ్ రియాక్షన్ 

ప్రస్తుతం ఇదే కాంట్రవర్సీపై ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ స్పందించాడు. సుమ, అలేఖ్య, రమ్య తనకు చెల్లెల్లతో సమానమని అన్నాడు. అలేఖ్య బూతులపై తన తరఫున క్షమాపణలు చెబుతున్నాను అని పేర్కొన్నాడు. వాళ్లు యూట్యూబ్‌ ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు తనను సంప్రదించారని తెలిపాడు. అందుకు తాను సలహాలు, సూచనలు కూడా ఇచ్చానని అన్నాడు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

అంతేకాకుండా వారు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారని సంచలన విషయాలు బయటపెట్టాడు. కానీ తాను వద్దని చెప్పగానే వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం ఆపేశారని అన్నాడు. అలేఖ్య బూతులు మాట్లాడకుండా ఉండాల్సింది. సోషల్ మీడియా ట్రోలింగ్స్‌తో అలేఖ్య అనారోగ్యానికి గురైందని అన్నాడు. ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో ఐసీయూలో ఉందని తెలిపాడు. అందువల్ల వారిని ఇకనుంచి వదిలేయండి అంటూ వేడుకున్నాడు. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అంతేకాకుండా ఇప్పుడు పచ్చళ్ల బిజినెస్ పూర్తిగా బంద్ అయిందని.. త్వరలో లడ్డూల బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అలేఖ్య చెల్లి రమ్య త్వరలో పూతరేకులు, స్వీట్స్, లడ్డూ వంటివాటితో కొత్త బిజినెస్ పెట్టబోతున్నారని తెలిపాడు. ఇదేదో రాష్ట్ర సమస్యలాగ తిడుతున్నారని.. ఈ వ్యవహారం ఏకంగా దేశాలు దాటిపోయిందని అన్నాడు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

బలుపు ఎక్కువై

ఫ్రస్టేషన్‌లో కస్టమర్లను తిట్టిందని.. వ్యాపారం చేయడం చేతకాక అలా చేసిందని అన్నాడు. బీపీ ఎక్కువై, కర్మబాగోలేక, ఇంకా చెప్పాలంటే బలుపు ఎక్కువై తిట్టేసిందని అన్నాడు. ఇప్పుడు అంతా అయిపోయింది. దుకాణాలన్నీ బంద్ అయిపోయాయి. అందువల్ల బీపీ, నోటుదూల ఉన్నోళ్లకు బిజినెస్ పనిచెయ్యదు అని చెప్పుకొచ్చాడు. దీంతో పాటు మరెన్నో షాకింగ్ విషయాలు తెలిపాడు.

(naa anveshana | latest-telugu-news | telugu-news | alekhyaa chitti pickle | alekhya chitti pickles controversy)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు