Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్

గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో చెలరేగిన మంటలు ఇంకా ఆరలేదు.ఈ క్రమంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మనోజ్ వెళ్లారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లను పోలీసులు జిరాక్స్ అని ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానని మనోజ్ నిన్ననే చెప్పారు.

New Update
Manchu Manoj Mohan Babu

Manchu Manoj Mohan Babu

గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో చెలరేగిన మంటలు ఇంకా ఆరలేదు ముఖ్యంగా ఆస్తుల వివాదాలు అన్నదమ్ముల మధ్య తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో జల్‌పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా.. మోహన్ బాబు ఏకంగా జర్నలిస్టులపై దాడి చేసి, బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగ వేడుకలను  ఘనంగా జరుపుకున్నారు.

Also Read:  Maha kumbh: మహా కుంభమేళాలో 'డిజిటల్ బాబా'..

అయితే ఇదంతా బాగానే ఉన్నా.. నిన్న తన కూతురు పుట్టిన తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో తిరుపతిలో సంక్రాంతి ఘనంగా జరుపుకోవాలని మంచు మనోజ్,  తన భార్య మౌనిక తో కలిసి తిరుపతికి వచ్చారు. అయితే యూనివర్సిటీ పై దాడి చేయడానికి వచ్చారు అని, ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చారని మోహన్ బాబు పోలీస్ లకు ఫిర్యాదు చేయగా.. మనోజ్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అనుమతులను నిరాకరిస్తూ మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లకుండా ఆపేశారు. 

Also Read: ISRO: ఇస్రో మరో ఘన ... అంతరిక్షంలో స్పేడెక్స్‌ డాకింగ్‌ ప్రక్రియ

అయితే ముందే మోహన్ బాబు యూనివర్సిటీ వరకు వెళ్లిన మంచు మనోజ్ దంపతులను అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో చేసేదేమీ లేక పక్కనే ఉన్న ఫార్మ్ హౌస్ లో ఉన్నారు.

ఈ క్రమంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మనోజ్ వెళ్లారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లను పోలీసులు జిరాక్స్ అని ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానని మనోజ్ నిన్ననే చెప్పారు. నిన్నటి పరిణామాలపై డీఎస్పీతో మనోజ్ చర్చిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తనకు అందకపోవడం... కోర్టు ఆర్డర్స్ జిరాక్స్ కాపీలు పోలీసుల వద్ద ఉండటంపై ఆయన మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య మౌనిక, లీగల్ టీమ్ ఉన్నారు.

దీనిపై మంచు మనోజ్ మాట్లాడుతూ.. “నేను రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా నారా వారి పల్లెలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ని ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌ని వెళ్లి కలిశాను. అయితే వారిని కలిసినప్పుడు నేను నా కుటుంబ వ్యవహారాలను ప్రస్తావించలేదు. ముఖ్యంగా ఈ గొడవల గురించి ఏమాత్రం కూడా వారితో నేను మాట్లాడలేదు. నా కూతురు పుట్టిన తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో ఇక్కడే జరుపుకోవాలని అనుకున్నాను. 

కానీ నా వల్ల వివాదం అవుతుందని అనుకోలేదు. నిన్న కూడా ఏదైతే వీఐపీ ల షెడ్యూల్ పూర్తయిందో, ఆ తర్వాతనే నేను రావాలని అనుకున్నాను. కానీ లోకేష్  కార్యకర్తల సమావేశంలో ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల, నేను ముందుగానే వెళ్లాను. దాంతో అక్కడ ఆయన ఉండడంతో ఆయనను కలిశాను. అంతే తప్ప మా కుటుంబ వివాదాల గురించి ప్రస్తావించలేదు.

నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే, కావాలనే మా మనుషుల మీద, అభిమానుల మీద దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై నేను ప్రశ్నించాను. అందుకే నా మీద వారు కోపంతో ఊగిపోతున్నారు. బయట కంపెనీలు పెట్టి ఇక్కడ విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎన్నో విషయాలను విద్యార్థుల నెత్తి పైన రుద్దుతున్నారు. 

ముఖ్యంగా పదవ తరగతి తర్వాత యూనిఫారం వేసుకోవాలంటే చాలామంది ఇబ్బంది పడతారు. అలాంటిది ఇంజనీరింగ్, పీజీలో కూడా యూనిఫామ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మోహన్ బాబు విద్యాసంస్థల్లో ఉంది. నేను దీనిని ప్రశ్నించాను. నా అభిమానులు, నాతో సన్నిహితంగా మెలిగిన వారిని దూరం చేయాలని, వారిని జనవరి 12వ తేదీన పిలిపించి మరీ బెదిరించారు. దీనికి తోడు నాపై కేసులు కూడా పెట్టారు. ఏది ఏమైనా తప్పు జరుగుతోందని.. ఇలా ఎందుకు జరుగుతోందని ? ప్రశ్నించడం వల్లే నాపై కేసులు పెట్టారు అంటూ మంచు మనోజ్ తెలిపారు.

Also Read: Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే ?

Also Read: ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు