/rtv/media/media_files/2025/01/16/Uq1ssUr7MBI15uQw6fPl.jpg)
space docking
Space Docking:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Also Read: Maha Kumbh: కుంభమేళా ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలు చుక్కల్లోనే
ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. గత డిసెంబర్ 30 న తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ లో నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సీ 60 లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ బయల్దేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1 బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్ -1ఏ రాకెట్ నుంచి విడిపోయాయి.
Also Read: Planet Parade: ఫిబ్రవరి 28న ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్ లోకి 7 గ్రహాలు!
ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం మూడుసార్లు ప్రయత్నించగా..పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు.
ఉపగ్రహాలను హోల్డ్ చేసి..
అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలు పెట్టారు.ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్ట్ లో రాసుకొచ్చింది.దీని కోసం శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది.
Also Read: Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే ?
Also Read: మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రైడ్స్తో మధ్యప్రదేశ్ రాజకీయం మలుపులు