/rtv/media/media_files/2025/03/03/3ASatskwmRIRDwp91ISe.jpg)
Lady Aghori Naga Sadhu Hulchul in Tanuku
ఇటీవల కాలంలో లేడీ అఘోరి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దాదాపు నెల రోజులకు పైగా అఘోరీ ఎపిసోడ్ నడిచింది. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ తల్లి టెంపుల్ వద్ద ఆమె చేసిన రచ్చతో వైరల్గా మారిపోయింది. అక్కడ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలను సందర్శించే క్రమంలో ఎన్నో సమస్యలను ఎదురయ్యాయి.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
ఏపీకి అఘోరీ
దేవాలయాలపై దాడులను ఆపుతానని.. దానికోసం తాను ఆత్మార్పణ చేసుకుంటానని పలుమార్లు ప్రయత్నం చేసింది. పోలీసులు సైతం అఘోరీని పట్టుకోవడం.. అక్కడ నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టడం చేశారు. అయితే ఇలా నెల రోజులు దాటిన తర్వాత అఘోరీ కుంభమేళాలో బిజీ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు ఏపీలో దర్శనమిచ్చింది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని తనుకు ప్రాంతానికి బయలుదేరింది.
Also read : SLBC tunnel : టన్నల్లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
RTVతో అఘోరీ లైవ్
తణుకు లో వున్న రాజేష్ నాథ్ అఘోర అమ్మాయిలను ట్రాప్ చేశాడు
— RTV (@RTVnewsnetwork) March 3, 2025
నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. వీడో మోసగాడు..
పోలీసులు వీడిపై యాక్షన్ తీసుకోకపోతే నేనే లేపేస్తా..
RTV తో లేడీ అఘోరి #Aghori #RajeshNathAghora #viralvideo #RTV pic.twitter.com/N6KANDfDnc
ఈ క్రమంలో RTV ఛానెల్తో ఆమె లైవ్లో మాట్లాడింది. తాను తనుకు వెళ్లడానికి గల కారణాలను వెల్లడింది. ఈ మేరకు అఘోరీ మాట్లాడుతూ.. రాజేష్ నాథ్ అనే అఘోరా మంచి చేస్తానని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు వసూళు చేస్తున్నాడని లేడీ అఘోరీ ఆరోపించింది. అంతేకాకుండా అఘోరా ముసుగులో అతడు అమ్మాలయిలను ట్రాప్ చేస్తున్నాడని.. అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ వాళ్లను వాడుకుంటున్నాడని.. వాటికి సంబంధించిన చాటింగ్, వీడియోలు తన వద్ద ఉన్నాయని అఘోరీ తెలిపింది. అందుకే అతడి వద్దకు వెళ్తున్నానని చెప్పుకొచ్చింది.
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!
రాజేష్ నాథ్ అనే వ్యక్తి అఘోరాగా చెప్పుకుంటూ ఆడపిల్లలను వేధిస్తున్నట్లు తనకు కంప్లైంట్లు వచ్చాయని అందుకే బయల్దేరి అతడిని ప్రశ్నించడానికి వెళ్తున్నానని అఘోరీ పేర్కొంది. అంతేకాకుండా రాజేష్ నాథ్ దగ్గర లైసెన్స్ లేని 10 గన్లు ఉన్నాయని తెలిపింది. ముందు తనుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. అప్పటికి వినకపోతే వాడిని బతకనియ్యను అని పేర్కొంది. ఈ క్రమంలోనే రాజేష్ నాథ్ పై ఫిర్యాదు చేసేందుకు తణుకు పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే అఘోరాపై ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంతో అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తణుకు PS వద్ద అఘోరీ హల్చల్
— ChotaNews App (@ChotaNewsApp) March 3, 2025
అఘోర రాజేష్ నాథ్ పై ఫిర్యాదు చేయడానికి తణుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అఘోరీ
అఘోరీ ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించిన పోలీసులు.
దీంతో పోలీసుల తీరుపై అఘోరీ ఆగ్రహం.పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నం చేసిన అఘోరీ pic.twitter.com/fuoYaQRXKU