ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఆందోళన
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని నిరసన చేపట్టారు. అనంతరం వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు లేఖ రాశారు.