/rtv/media/media_files/2025/04/10/NHAmEuSZdResL3Z09B3S.jpg)
bharathi ys
AP TDP:
ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదంది. కిరణ్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చేబ్రోలు కిరణ్ పై కేసు పెట్టాలని జిల్లా టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. అధిష్టానం ఆదేశాలతో కిరణ్ పై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేయనున్నారు.. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలంటూ అధిష్టానాన్ని కోరుతూ కిరణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
— RTV (@RTVnewsnetwork) April 10, 2025
మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదంది.
కిరణ్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చేబ్రోలు కిరణ్ పై కేసు… pic.twitter.com/YJsSO4nLA9
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..