International Yoga Day 2025: విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు వరించింది. 25వేల మంది గిరిజన స్టూడెంట్స్‌తో 108 నిమిషాలపాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ రికార్డు సాధించిన విద్యార్థులను నారా లోకేష్ అభినందించారు.

New Update
International Yoga Day 2025 pm modi

International Yoga Day 2025 pm modi

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ తీరాన భారీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. 

యోగాంధ్రకు గిన్నీస్ వరల్డ్ రికార్డు

ఏపీ ప్రభుత్వం ఈ యోగా ఈవెంట్‌ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనిని గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డులో చోటు దక్కించుకునే విధంగా కార్యక్రమాన్ని ప్లాన్​ చేసింది. ఇందులో భాగంగానే 25 వేల మంది గిరిజన స్టూడెంట్స్‌తో 108 నిమిషాలపాటు 108 సూర్య నమస్కారాలతో విశాఖలో జరిగిన మెగా యోగా ఈవెంట్ గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో సూరత్‌లో రికార్డును ఏపీ అధిగమించింది. 

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్​ 20వ తేదీన 25వేల మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారని ఆయన తెలిపారు. ఇలా ఒకేసమయంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేస్తున్న రికార్డును క్రియేట్ చేయాలనుకున్నామని చంద్రబాబు అన్నారు. యోగా అంతర్జాతీయ స్థాయికి చేరడానికి ప్రధాని నరేంద్ర మోదీనే ప్రధాన కారణమని ఆయన తెలిపారు. 

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

మోదీ ప్రసంగం

అంతకంటే ముందు ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు సుమారు 26 కి.మీ కారిడర్‌లో ఈ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో 3 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ప్రసంగంతో అదరగొట్టేశారు. దశాబ్దకాలంలో యోగా సాధించిన ప్రస్తానం చూస్తే తనకు ఎన్నో విషయాలు గుర్తొకొస్తాయన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా యోగాపై భారీ స్థాయిలో ఐకమత్యం కనిపిస్తుండటం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. యోగా కోసం ప్రపంచం మొత్తం ఒక్కటి కావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మోదీ యోగాసనాలు వేశారు. 

 Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

Advertisment
Advertisment
తాజా కథనాలు