/rtv/media/media_files/2025/05/11/t4R1pzGEsQvzhuspTrVc.jpg)
MODI Harsha kumar
ప్రధాని మోదీ భారత సార్వభౌమత్వాన్ని అమెరికా పాదల చెంత తాకట్టుపెట్టాడని మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. కాల్పుల విరమణ జరిగిన తీరు బాగాలేదన్నారు. యుద్ధ విరమణను అమెరికా ప్రెసిడెంట్ ట్వీట్ ద్వారా ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. సిమ్లా ఒప్పందం ప్రకారం.. భారత్-పాక్ మధ్య సమసల్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించాలన్నారు. మూడో దేశానికి ఛాన్స్ ఇవ్వొద్దన్నారు. నేడు ఆ నిబంధనను మోదీ ఉల్లంఘించారని ఆరోపించారు. భారతదేశాన్ని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారన్నారు. ఎవరు ఇచ్చారు ఆ అధికారం? అని ప్రశ్నించారు.
యుద్ధం ఆగిన సంతోషం లేదు..
యుద్ధం ఆగిన సంతోషం ఎవరిలో లేదన్నారు. రాత్రి నుంచి నిద్ర పట్టడం లేదన్నారు. ప్రతీ భారతీయుడిని కించపరిచేలా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందన్నారు. పహల్గామ్ మృతులకు మీరిచ్చే నివాళి ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ రకంగా విరమణ చేయడం సగటు భారతీయుడిగా జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి మంచి ఛాన్స్ అని అన్నారు. మోదీ ఇంత సులువుగా లొంగిపోతాడని అనుకోలేదన్నారు. IMF నుంచి భారత్ కు లోన్ ఆపడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయ్యిందన్నారు.
(2025 india pakistan war | telugu-news | narendra-modi | telugu breaking news | india operation sindoor)