/rtv/media/media_files/2025/04/25/kwGeWavk0UfGYNMSL9IP.jpg)
Honey Bees Attack
ఏపీలోని పార్వతీపురంలో దారుణం జరిగింది. పెళ్లి కోసం వెళ్లిన జనాలు.. చావు అంచుల వరకు వెళ్లారు. ఊరు ఊరంతా డీజే పాటలకు డ్యాన్స్ వేస్తున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. దీంతో పదుల సంఖ్యలో పెళ్లి బృందం హాస్పిటల్పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ తేనెటీగల దాడిలో సుమార్ 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.
వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటనే బాధితుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన పెళ్లి వారు.. హాస్పిటల్లో నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.
గతంలో చావు దగ్గర సంఘటన
ఏపీలోని అల్లూరి జిల్లాలోని గన్నేరు కొయ్యపాడులో కొప్పుల పల్లాయమ్మ (86) మృతి చెందింది. దీంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అంతిమయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే శవాన్ని పాడెపై ఎక్కించి తీసుకెళ్తుండగా.. అదే సమయంలో బాణాసంచా కాల్చారు.
దీంతో అందులో కొన్ని టపాకాయలు పక్కనే ఉన్న చెట్టుపై పడ్డాయి. సరిగ్గా అక్కడే తేనెతుట్టు ఉండటంతో దానికి ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా చెల్లా చెదురయ్యాయి. అదే సమయంలో అంతిమయాత్రలో ఉన్న వారిపై ఏకదాటిగా దాడి చేశాయి. దీంతో అంతిమయాత్రలో పాల్గొన్నవారంతా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు పెట్టారు.
ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని గౌరీదేవి పేట PHCకి తరలించి చికిత్స అందించారు. ఇంకొంతమంది భద్రాచలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ తేనెటీగల దాడి అనంతరం బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో ఈ ఘటనతో చాలా మంది ఉలిక్కి పడ్డారు. చావుకు వెళ్తే చచ్చేంత పనైందిరా బాబు అంటూ పలువురు బందువులు మాట్లాడుకున్నారు.
Honey Bees Attack | latest-telugu-news | telugu-news | viral-news